News February 12, 2025
అమ్మాయిలూ.. క్యాబ్ బుక్ చేస్తున్నారా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739344809482_746-normal-WIFI.webp)
ఉబర్లో క్యాబ్ బుక్ చేసిన ఓ మహిళకు డ్రైవర్ వాట్సాప్లో అసభ్యకరంగా మెసేజ్లు పంపించి ఇబ్బందికి గురిచేశాడు. కేరళలోని కట్రికడావులో ఓ మహిళ ‘ఉబర్’లో క్యాబ్ బుక్ చేసింది. అయితే, రెండు రోజుల తర్వాత ఆమె వాట్సాప్కు అపరిచిత వ్యక్తి నుంచి ‘మీరు వాడే స్ప్రే ఏ కంపెనీ’ అని మెసేజ్లు రావడంతో ఆమె అతణ్ని బ్లాక్ చేసింది. ట్విటర్లో ఈ విషయాన్ని ‘ఉబర్’కు తెలియజేస్తూ అసహనం వ్యక్తం చేసింది. ఈ పోస్ట్ వైరలవుతోంది.
Similar News
News February 12, 2025
కొత్త రేషన్ కార్డులు.. ప్రభుత్వం కీలక సూచన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737176982003_367-normal-WIFI.webp)
TG: రేషన్ కార్డు దరఖాస్తులపై పౌరసరఫరాల శాఖ కీలక సూచనలు చేసింది. దరఖాస్తు రసీదును ఎక్కడా ఇవ్వాల్సిన అవసరం లేదని, వారి వద్దే భద్రపరుచుకోవాలని చెప్పింది. అప్లికేషన్ల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని, నిర్దిష్ట గడువు ఏమి లేదని పేర్కొంది. కాగా కొన్ని చోట్ల రేషన్ కార్డు దరఖాస్తులకు భారీగా వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపించిన సంగతి తెలిసిందే.
News February 12, 2025
ముస్లిం ప్రభుత్వోద్యోగులకు ఏపీ GOVT గుడ్ న్యూస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739373829071_1045-normal-WIFI.webp)
AP: ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ముస్లింలకు రాష్ట్ర సర్కారు గుడ్న్యూస్ చెప్పింది. రంజాన్ మాసంలో విధుల నుంచి వారు గంట ముందుగానే వెళ్లేందుకు అనుమతినిచ్చింది. వచ్చే నెల 2 నుంచి 30 వరకు ముస్లిం ఉద్యోగులు ఓ గంట ముందే విధుల నుంచి వెళ్లొచ్చని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విభాగాల ఉద్యోగులకూ ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. అదే విధంగా ముస్లింలందరికీ రంజాన్ తోఫాను అందించాలని CM నిర్ణయించారు.
News February 12, 2025
హీరో విజయ్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ సేవలు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739371869704_1045-normal-WIFI.webp)
తమిళ హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం(TVK) పేరుతో కొత్త పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్తో భేటీ కావడం తమిళ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పీకేను తమ సలహాదారుగా విజయ్ నియమించుకోవాలని భావిస్తున్నారంటూ ప్రచారం నడుస్తోంది. వచ్చే ఏడాదే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.