News August 20, 2024

3 వారాల్లో మ‌ధ్యంత‌ర నివేదిక ఇవ్వండి: SC

image

దేశ‌వ్యాప్తంగా ఆస్ప‌త్రులు, వైద్య సంస్థ‌ల్లో వైద్యులు, సిబ్బంది ర‌క్ష‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై మూడువారాల్లో మ‌ధ్యంతర నివేదిక ఇవ్వాల‌ని నేష‌న‌ల్ టాస్క్‌ఫోర్స్‌ను సుప్రీంకోర్టు కోరింది. పూర్తిస్థాయి నివేదిక‌ను 3 నెల‌ల్లో అంద‌జేయాలంది. క్యాబినెట్ సెక్ర‌ట‌రీ, కేంద్ర హోం, ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శులు టాస్క్‌ఫోర్స్‌కు అవ‌స‌ర‌మైన స‌హ‌కారాన్ని అందించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Similar News

News November 24, 2025

BMC బ్యాంక్‌లో ఉద్యోగాలు

image

బాంబే మర్కంటైల్ కోఆపరేటివ్(BMC) బ్యాంక్ లిమిటెడ్‌.. బ్యాంక్ మేనేజర్, క్రెడిట్ ఆఫీసర్, ఏరియా హెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 1, 2026వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 30 -50ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://bmcbankltd.com/

News November 24, 2025

భారతీయ వైద్యం వైపు అమెరికన్ల మొగ్గు!

image

అమెరికాతో పోల్చితే ఇండియాలో వైద్య సదుపాయం చాలా బెటర్ అని వైద్యులు చెబుతున్నారు. ఈక్రమంలో పెరుగుతున్న ఖర్చులు, వెయిటింగ్ కారణంగా అమెరికా వంటి పాశ్చాత్య దేశాల రోగులు భారతీయ వైద్యం వైపు మళ్లుతున్నట్లు పేర్కొన్నారు. ‘భారత్‌లో అత్యల్ప ఖర్చు, తక్షణ అపాయింట్‌మెంట్‌లు (సూపర్ స్పెషలిస్ట్‌లతో సహా), MRI/CT స్కాన్ల వంటి త్వరిత డయాగ్నస్టిక్ సేవల వల్ల రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి’ అని తెలిపారు.

News November 24, 2025

పెరిగిన మంచు తీవ్రత.. మినుము పంటకు తెగుళ్ల ముప్పు

image

గాలిలో అధిక తేమ, మంచు, మబ్బులతో కూడిన వాతావరణం వల్ల మినుము పంటలో.. కాయ దశలో ఆకు మచ్చ తెగులు మరియు బూడిద తెగులు ఆశించే అవకాశం ఉంది. ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి హెక్సాకొనజోల్ 2 మి.లీ. లేదా ఒక మి. లీ ప్రాపికొనజోల్ 1ml కలిపి పిచికారీ చేయాలి. వీటితో పాటు లీటరు నీటికి 1ml మైక్లోబుటానిల్ పిచికారీ చేసి బూడిద తెగులును కూడా నివారించవచ్చని వ్యవసాయ నిపుణులు తెలిపారు.