News March 8, 2025
మహిళలు ఒక మర్డర్ చేసేందుకు ఇమ్యూనిటీ కల్పించండి: NCP SP

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు NCP SP మహిళా విభాగం చేసిన విజ్ఞప్తి చర్చనీయాంశంగా మారింది. ఒక హత్య చేసినా మహిళలకు శిక్ష పడకుండా రక్షణ కల్పించాలని ఆ శాఖ ప్రెసిడెంట్ రోహిణి ఖడ్సే కోరారు. ‘స్త్రీలందరి తరఫున మేం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఒక మర్డర్ చేసేందుకు మాకు ఇమ్యూనిటీ కల్పించండి. అణచివేత వైఖరి, రేపిస్టు మైండ్సెట్, చైతన్యం లేని శాంతిభద్రతల పరిస్థితిని స్త్రీలు చంపాలని భావిస్తున్నారు’ అని లేఖ రాశారు.
Similar News
News April 10, 2026
ఒకట్రెండు రోజుల్లో ఇంటర్ ఫలితాలు?

TG: రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను ఈ నెల 11-13 తేదీల్లో రిలీజ్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈసారి 9.97L మంది ఎగ్జామ్స్ రాయగా ఒక్క సబ్జెక్టులో ఫెయిలైన వారు దాదాపు లక్ష మంది ఉన్నట్లు సమాచారం. దీంతో పొరపాట్లకు తావు లేకుండా వారి ఆన్సర్ షీట్లను మరోసారి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ ఫలితాలను కావాలనే ఆలస్యం చేస్తున్నారంటూ SMలో జరుగుతున్న ప్రచారాన్ని నిన్న బోర్డు <<19609277>>ఖండించిన<<>> విషయం తెలిసిందే.
News April 10, 2026
డిజిటల్ సెన్సస్: 5.72లక్షల ఫ్యామిలీలు నమోదు

దేశ వ్యాప్తంగా ‘Census2027’ డిజిటల్ నమోదు ప్రక్రియ ఊపందుకుంది. మొదటి దశలో భాగంగా ఎంపిక చేసిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ‘స్వీయ గణన’ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు 5.72 లక్షలకు పైగా కుటుంబాలు ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకున్నాయి. కాగా త్వరలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనూ ఈ స్వీయ గణన ప్రక్రియ ప్రారంభంకానుంది. దీనిద్వారా ఎవరికివారు ఆన్లైన్లో తమ వివరాలు నమోదు చేయవచ్చు.
News April 10, 2026
శాంతి చర్చల వేళ.. పాక్vsఇజ్రాయెల్

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల వేళ పాక్, ఇజ్రాయెల్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ దుష్ట, క్యాన్సర్ దేశమని పాక్ రక్షణ మంత్రి ఖవాజా విమర్శించారు. గాజా, లెబనాన్లో మారణ హోమం చేస్తోన్న ఆ దేశాన్ని నాశనం చేయాలన్నారు. ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ఘాటుగా స్పందించింది. మీడియేటర్గా ఇలాంటి కామెంట్లు దారుణమంది. ఉగ్రవాదుల నుంచి ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకుంటుందని పేర్కొంది.


