News August 6, 2024

జగన్‌కు జడ్+ సెక్యూరిటీ ఇస్తున్నాం: పోలీస్ శాఖ

image

AP: జగన్ సీఎంగా ఉన్నప్పుడు అదనంగా కల్పించిన భద్రతను మాత్రమే తగ్గించామని పోలీస్ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం మాజీ సీఎం హోదాలో నిబంధనల ప్రకారం జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించామని తెలిపింది. తనకు భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ జగన్ <<13783949>>హైకోర్టుకు<<>> వెళ్లడంతో అధికారులు స్పందించారు. చంద్రబాబు మాజీ సీఎంగా ఉన్నప్పుడు ఎంత భద్రత కల్పించామో ఇప్పుడు జగన్‌కు అలాగే ఇచ్చామన్నారు.

Similar News

News February 16, 2025

తాజ్ మహల్‌ను సందర్శించిన రిషి సునాక్

image

బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ తాజ్‌ మహల్ సందర్శించారు. తన భార్య పిల్లలతో పాటు అత్తమ్మ సుధామూర్తితో కలిసి 90 నిమిషాల పాటు అక్కడ గడిపారు. ఈ పర్యటన తమ పిల్లలు ఎప్పటికీ మర్చిపోరని అతిథ్యానికి ధన్యవాదాలు అని విజిటర్‌ బుక్‌లో రాశారు. అయితే రిషి సునాక్ రేపు ఉదయం మరోసారి తాజ్‌మహల్ చూడటంతో పాటు ఆగ్రాలోని పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని ప్రస్తుతం భారత పర్యటనలోఉన్నారు.

News February 16, 2025

KCR బర్త్‌డే రోజున సామాజిక కార్యక్రమాలు: KTR

image

TG: BRS అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా FEB 17న సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు KTR పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎవరికి తోచిన విధంగా వారు ఇతరులకు సహాయపడేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రక్తదాన శిబిరాలు పండ్ల పంపిణీ, అన్నదానం వంటి కార్యక్రమాలు చేపట్టాలని KTR విజ్ఞప్తి చేశారు.

News February 16, 2025

WPL: ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం

image

ముంబైతో జరిగిన మ్యాచులో ఢిల్లీ విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు ఆఖరి బంతికి అందుకుంది. చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా తొలి బంతికి నిక్కీ ప్రసాద్ ఫోర్ బాదారు. ఆ తర్వాతి 3 బంతులకు నాలుగు పరుగులు రాగా ఐదో బంతికి నిక్కీ ఔటయ్యారు. చివరి బంతికి అరుంధతి రెండు పరుగులు తీసి ఢిల్లీకి విజయాన్ని అందించారు.

error: Content is protected !!