News April 1, 2024
ఇంటికే వెళ్లి పింఛన్లు ఇవ్వాలి: సీఎస్కు టీడీపీ వినతి

AP: వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు విధించినందున లబ్ధిదారులకు పెన్షన్లను ఇంటి వద్దే అందించే ఏర్పాట్లు చేయాలని సీఎస్ జవహర్రెడ్డికి టీడీపీ నేతలు వినతి పత్రం అందించారు. పెన్షన్ల పంపిణీని ఈ నెల 5లోగా పూర్తి చేయాలని కోరారు. ఈసీ ఉత్తర్వులను అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో టీడీపీకి చెడ్డపేరు తెచ్చేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
Similar News
News January 27, 2026
పుస్తకాలే లోకమైన అక్షర తపస్వికి దక్కిన గౌరవం!

పుస్తకాలపై మక్కువతో తన ఆస్తినే అమ్ముకున్న కర్ణాటకలోని హరలహల్లికి చెందిన అంకే గౌడ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. బస్ కండక్టర్గా పనిచేస్తూనే 20 లక్షల పుస్తకాలతో అతిపెద్ద వ్యక్తిగత లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఇందులో 5 లక్షల విదేశీ పుస్తకాలు, 5 వేల నిఘంటువులు ఉన్నాయి. ఒక సామాన్యుడి పట్టుదల ఇప్పుడు దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని పొందేలా చేసింది. ఆయన కృషి నేటి తరానికి ఎంతో స్ఫూర్తి.
News January 27, 2026
సీరియల్ నటి భర్తపై కత్తితో దాడి!

కన్నడ సీరియల్ నటి కావ్య గౌడ భర్త సోమశేఖర్ కత్తి గాయాలతో ఆస్పత్రిలో చేరారు. తమ కుటుంబసభ్యులే ఈ దాడికి పాల్పడినట్లు నటి ఆరోపించారు. కావ్య గౌడ సోదరి భవ్య గౌడ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమ్మడి కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మాటామాటా పెరగడంతో సోమశేఖర్పై సోదరుడు, బంధువులే దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ‘అక్కమొగుడు’ సీరియల్తో ఈమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు.
News January 27, 2026
అఫ్గాన్లో వర్ణ వ్యవస్థ.. 4 తరగతులుగా ప్రజల విభజన!

తాలిబన్ల పాలనలోని అఫ్గాన్లో కొత్త క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వివాదాస్పదమైంది. ప్రజలను 4 తరగతులుగా విభజించడమే ఇందుకు కారణం. ఈ వర్ణ వ్యవస్థలో స్కాలర్లు(ముల్లాలు), ఎలైట్(పాలకులు), మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ ఉంటారు. ముల్లాలు తప్పు చేసినా శిక్షలుండవు. ఎలైట్ వ్యక్తులకు నోటీసు, సూచన ఇస్తారు. మిడిల్ క్లాస్కు జైలుశిక్ష, లోయర్ క్లాస్కు జైలుతోపాటు శారీరక శిక్ష విధిస్తారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది.


