News October 1, 2024
మూసీలో గోదావరి నీళ్లు పారిస్తాం: మంత్రి కోమటిరెడ్డి

TG: మూసీ నదిని ప్రక్షాళన చేసి గోదావరి జలాలు తీసుకురావాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మల్లన్నసాగర్ జలాశయం నుంచి మూసీకి నీటిని తరలిస్తామన్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, గత ప్రభుత్వం మూసీని ఎందుకు ప్రక్షాళన చేయలేదని ప్రశ్నించారు. గతంలో మూసీ ప్రక్షాళన కోసం తెచ్చిన రూ.1,000 కోట్ల అప్పు ఎందుకోసం ఖర్చు చేశారని నిలదీశారు.
Similar News
News November 28, 2025
ఎన్నికలను రద్దు చేయాలి: ఆర్.కృష్ణయ్య

TG: స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలని BC నేత, రాజ్యసభ MP ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. HYD గన్ పార్క్ వద్ద BC సంఘాలతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో <<18403510>>46<<>>ను రద్దు చేసి జీవో9ను పునరుద్ధరించాలని అన్నారు. లేదంటే బీసీల తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. BCలకు 42% రిజర్వేషన్లు కేటాయించకపోవడంపై బీసీ సంఘాలు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే.
News November 28, 2025
ఎన్నికలను రద్దు చేయాలి: ఆర్.కృష్ణయ్య

TG: స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలని BC నేత, రాజ్యసభ MP ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. HYD గన్ పార్క్ వద్ద BC సంఘాలతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో <<18403510>>46<<>>ను రద్దు చేసి జీవో9ను పునరుద్ధరించాలని అన్నారు. లేదంటే బీసీల తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. BCలకు 42% రిజర్వేషన్లు కేటాయించకపోవడంపై బీసీ సంఘాలు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే.
News November 28, 2025
వరిలో జింక్ లోపం, కాండం తొలిచే పురుగు నివారణ

☛ వరి పంట మొక్క ఆకుల మీద ఇటుక రంగు మచ్చలు కనిపిస్తే జింక్ లోపంగా భావించాలి. జింక్ లోప నివారణకు లీటరు నీటికి 2 గ్రా. చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి 5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
☛ వరిలో కాండం తొలిచే పురుగు/మొగి పురుగు నివారణకు 20-25 కిలోల ఇసుకలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జి గుళికలు 8 కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4జి గుళికలు 4 కిలోల చొప్పున కలిపి బురద పదునులో వేయాలి.


