News November 15, 2024

జులై నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు: మంత్రి నిమ్మల

image

AP: నదుల అనుసంధానంతో కరవు నివారించాలనేది CM చంద్రబాబు లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో చెప్పారు. ‘చంద్రబాబు తొలి ప్రాధాన్యం పోలవరం, రెండోది ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. YCP హయాంలో ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదు. మేం వచ్చాక రూ.1,600 కోట్లతో టెండర్లు పూర్తిచేశాం. త్వరగా పూర్తిచేసి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటాం. వచ్చే ఏడాది జులై నాటికి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలిస్తాం’ అని ప్రకటించారు.

Similar News

News January 7, 2026

భారత్ మాకు విలువైన భాగస్వామి.. మోదీ ట్వీట్‌కు నెతన్యాహు రిప్లై

image

భారత్-ఇజ్రాయెల్ ప్రధానులు మోదీ, నెతన్యాహు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇజ్రాయెల్ ప్రజలకు నూతన ఏడాది శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ప్రాంతీయ పరిస్థితుల గురించి చర్చించామని మోదీ తెలిపారు. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు దృఢ సంకల్పంతో ఉన్నామని ట్వీట్ చేశారు. ‘భారతదేశంతో ఉన్న లోతైన భాగస్వామ్యాన్ని ఇజ్రాయెల్ విలువైనదిగా భావిస్తుంది. కలిసి ఉగ్రవాదాన్ని ఓడిద్దాం’ అని నెతన్యాహు రిప్లై ఇచ్చారు.

News January 7, 2026

H-1B వీసా ప్రోగ్రామ్ రద్దు కోరుతూ బిల్

image

విదేశీయులు USలో ఉద్యోగాలు చేయడానికి వీలుగా ఉన్న H-1B వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని రిపబ్లికన్ నేత మార్జోరీ టైలర్ గ్రీన్ హౌస్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. H-1B వీసాతో పాటు అమెరికా పౌరుల ప్రయోజనాలకు ఇమిగ్రేషన్‌ యాక్ట్‌లో పలు మార్పులను బిల్లులో ప్రతిపాదించారు. అయితే బిల్లు పెట్టి కాసేపటికే ఆమె రిజైన్ చేశారు. జెఫ్రీ ఎప్‌స్టీన్ ఇన్వెస్టిగేషన్ ఫైల్స్ బయటకు రావడంతోపాటు పలు వివాదాల్లో చిక్కుకున్నారు.

News January 7, 2026

ఒకే బెడ్‌రూమ్‌లో రెండు బెడ్‌లు ఉండవచ్చా?

image

ఒకే బెడ్‌రూమ్‌లో రెండు బెడ్‌లు ఉండడం వాస్తు ప్రకారం సరికాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ఇది భార్యాభర్తల మధ్య గొడవలు తేవొచ్చని అంటున్నారు. విరిగిపోయిన ఫర్నిచర్, పనికిరాని పాత వస్తువులు ఇంట్లో ఉంచితే ప్రతికూల శక్తి పెరుగుతుందని అంటున్నారు. ‘గురువుల చిత్రపటాలు చదువుకునే గదిలో ఉంచితే వారి ఆశీస్సులు అందుతాయి. ఇంటి శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఈ నియమాలు పాటించాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>