News November 15, 2024
జులై నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు: మంత్రి నిమ్మల

AP: నదుల అనుసంధానంతో కరవు నివారించాలనేది CM చంద్రబాబు లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో చెప్పారు. ‘చంద్రబాబు తొలి ప్రాధాన్యం పోలవరం, రెండోది ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. YCP హయాంలో ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదు. మేం వచ్చాక రూ.1,600 కోట్లతో టెండర్లు పూర్తిచేశాం. త్వరగా పూర్తిచేసి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటాం. వచ్చే ఏడాది జులై నాటికి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలిస్తాం’ అని ప్రకటించారు.
Similar News
News March 5, 2026
హైదరాబాద్ CCMBలో ఉద్యోగాలు

HYDలోని<
News March 5, 2026
రాజ్యసభ అభ్యర్థి నితీశ్ కుమార్ నామినేషన్

బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం షా సమక్షంలో నితీశ్ నామినేషన్ ఫైల్ చేశారు. రాజ్యసభ ఎన్నికలు జరిగే మార్చి 16 వరకు ఆయన సీఎం పదవిలో ఉంటారని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి.
News March 5, 2026
‘ఇండియా అతిథి’ని ముంచేశారు.. USకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్

శ్రీలంక తీరంలో తమ యుద్ధ నౌకను అమెరికా ముంచేయడంపై ఇరాన్ మండిపడింది. ‘ఇరాన్ తీరానికి 2 వేల మైళ్ల దూరంలో అమెరికా ఈ దారుణానికి పాల్పడింది. 130 మంది నావికులతో కూడిన ఫ్రిగేట్ దేనా.. ఇండియన్ నేవీకి అతిథి. కానీ ఎలాంటి హెచ్చరికలు లేకుండానే నౌకను ముంచేశారు. నా మాటలను గుర్తుంచుకోండి. అమెరికా <<19299071>>చేసిన పనికి<<>> తీవ్రంగా పశ్చాత్తాపపడాల్సిన టైం వస్తుంది’ అని విదేశాంగ మంత్రి అబ్బాస్ అఘార్చీ హెచ్చరించారు.


