News March 8, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

వరుసగా రెండు రోజుల పాటు తగ్గిన బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.500 పెరిగి రూ.80,400లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.550 పెరగడంతో రూ.87,710లకు చేరింది. అటు వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పులేదు. కేజీ వెండి ధర రూ.1,08,100 వద్ద కొనసాగుతోంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.
Similar News
News March 26, 2025
IPLలో సరికొత్త చరిత్ర

IPL 2025 సరికొత్త జోష్తో కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచుల్లో సగటున 3.9 బంతులకు ఫోర్, 9.9 బంతులకు సిక్సర్ నమోదైంది. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఈ స్థాయిలో దూకుడుగా ఆడటం ఇదే తొలిసారి. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో కనీసం 20+ పరుగులు నమోదైన ఓవర్లు 20 ఉన్నాయి. ఇక ప్రారంభంలోనే SRH 286 పరుగులు చేసి 300 పరుగులు కొట్టేస్తామని ఇతర జట్లకు హెచ్చరికలు జారీ చేసింది.
News March 26, 2025
రేపటి నుంచి జాతీయ కరాటే ఛాంపియన్షిప్

TG: HYD గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రేపటి నుంచి ఈ నెల 29 వరకు నాలుగో జాతీయ కరాటే ఛాంపియన్షిప్ జరగనుంది. సీనియర్, అండర్ 21, పారా కేటగిరీల్లో పోటీలను నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 1,500 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. రేపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోటీలను ప్రారంభిస్తారు. 29న ముగింపు వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొని బహుమతులు ప్రదానం చేస్తారు.
News March 26, 2025
IPL-2025: KKR టార్గెట్ ఎంతంటే?

గువాహటిలో జరుగుతున్న మ్యాచ్లో KKRపై RR 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లెవరూ 30+ పరుగులు చేయకపోవడంతో రన్రేట్ నెమ్మదిగా కదిలింది. హసరంగా(4)ను బ్యాటింగ్ ఆర్డర్లో పైకి పంపడం వర్కౌట్ అవ్వలేదు. జురెల్ 33 పరుగులతో రాణించారు. చివర్లో ఆర్చర్ 2 సిక్సులతో మెరిశారు. వైభవ్ అరోరా, మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా తలో 2 వికెట్లు తీశారు. KKR టార్గెట్ 152 పరుగులు.