News February 6, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.250 పెరిగి రూ.79,300లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.270 పెరగడంతో రూ.86,510 పలుకుతోంది. కాగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. వివాహాలు ఉండటంతో కొనుగోలుదారులకు ఇది మరింత భారం కానుంది.
Similar News
News March 22, 2025
స్కూళ్లకు ఇవాళ సెలవు ఇవ్వాలని వినతి

TG: రాష్ట్రంలో అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు పడుతున్నాయి. చాలా చోట్ల చెట్లు నేలకూలి రోడ్లపై పడ్డాయి. <<15840994>>ఇవాళ<<>> కూడా బలమైన గాలులతో కూడిన వడగళ్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో స్కూళ్లకు సెలవు ఇవ్వాలని పేరెంట్స్ కోరుతున్నారు. గాలివానలో పిల్లలను పాఠశాలలకు పంపడంపై ఆందోళన చెందుతున్నారు. దీనిపై మీరేమంటారు?
News March 22, 2025
బయట తినాలంటేనే భయమేస్తోంది

TG: ప్రముఖ రెస్టారెంట్లలో అపరిశుభ్ర వాతావరణం ఫుడ్ లవర్స్ను ఆందోళనకు గురి చేస్తోంది. గత కొన్ని రోజులుగా HYDలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తోన్న దాడుల్లో కుళ్లిన మాంసం లభించగా, కిచెన్ శుభ్రంగా లేదని, కూరగాయలు సరిగ్గా నిల్వ చేయట్లేదని సోదాల్లో తేల్చారు. దీంతో ఇలాంటి ఫుడ్ ఎలా తినాలని పలువురు కామెంట్లు చేస్తున్నారు. డబ్బులు వెచ్చించినా నాణ్యమైన ఫుడ్ ఇవ్వకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News March 22, 2025
రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్

AP: రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల ఈకేవైసీ ఈ నెల 31లోగా పూర్తి చేయాలని పౌరసరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్ జిల్లాల అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల మొబైల్ యాప్, రేషన్ షాపులోని ఈ పాస్ పరికరాల ద్వారా అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. 5 ఏళ్లలోపు పిల్లలు మినహా గడువులోగా ఈకేవైసీ పూర్తి చేయాలని లేకపోతే లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కమిషనర్ హెచ్చరించారు.