News August 18, 2025
ఒడిశాలో బంగారు నిల్వలు.. త్వరలోనే తవ్వకాలు

ఒడిశాలో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(GSI) గుర్తించింది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో దాదాపు 20 మెట్రిక్ టన్నుల వరకు బంగారం నిల్వలు ఉన్నట్లు అంచనా వేసింది. ఇతర దేశాల నుంచి పెద్ద మొత్తంలో బంగారం దిగుమతి చేసుకునే భారత్కు ఇది కాస్త ఊరటనివ్వనుంది. ఇప్పటికే బంగారం మైనింగ్కు సంబంధించి ఒడిశా ప్రభుత్వం పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. త్వరలోనే వేలం నిర్వహించనుంది.
Similar News
News August 20, 2025
ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలన్నదే లక్ష్యం: చంద్రబాబు

AP: రతన్ టాటా భరతమాత ముద్దు బిడ్డ అని CM చంద్రబాబు అన్నారు. ఎవరైనా డబ్బు సంపాదించాలని చూస్తారని, టాటా మాత్రం సంపాదనను ఇతరులకు పంచేవారని చెప్పారు. RTIH ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తు అంతా ITదేనని గుర్తు చేశారు. సరైన ప్రభుత్వ విధానాలు అవలంబిస్తే సంపద వస్తుందన్నారు. గతంలో ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ నిపుణుడు ఉండాలని పనిచేశామని, ఇప్పుడు ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలన్నదే లక్ష్యమని తెలిపారు.
News August 20, 2025
UPI: స్కాన్ చెయ్ సరుకులు తెచ్చెయ్!!

ఇంటి పక్కన కిరాణా షాపు నుంచి షాపింగ్ మాల్ వరకు కౌంటర్ ఏదైనా.. UPI స్కాన్తో కొనేస్తున్నాం. ఈ జులైలో 303 కోట్ల ట్రాన్సాక్షన్లతో (₹64,881Cr) గ్రోసరీస్ టాప్ UPI కేటగిరీగా ఉంది. అంటే పాల ప్యాకెట్లు, ఉప్పు, పప్పులు వగైరా కిరాణా సరుకులు, కాయగూరలకు ఎక్కువ UPI పేమెంట్స్ చేస్తున్నారు. ఇక టీ, టిఫిన్, స్నాక్స్ సెంటర్లది సెకండ్ ప్లేస్ (100 కోట్ల పేమెంట్లు, ₹13794 Cr) . మీరు UPIని ఎక్కువగా ఎక్కడ వాడుతున్నారు?
News August 20, 2025
మేడారం జాతరకు రూ.150 కోట్లు విడుదల

TG: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర జరగనుంది.