News January 3, 2025
Gold vs Sensex: ఫస్ట్ 100,000 మైలురాయిని తాకేదేంటి?
కొత్త ఏడాది కావడంతో బంగారం, సెన్సెక్స్లో లక్ష మైలురాయిని ఏది ముందుగా తాకుతుందన్న చర్చ జరుగుతోంది. జియో పొలిటికల్ టెన్షన్స్, అనిశ్చితి, ట్రంప్ అధికారం చేపడుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది అనలిస్టులు గోల్డుకే ఓటేస్తున్నారు. కొందరు 2025, మరికొందరు 2026లో టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది సెన్సెక్స్ 96,000 స్థాయిని చేరొచ్చని చెప్తున్నారు. చివరి ఆరేళ్లలో GOLD 16.6%, SENSEX 14% AVG రాబడి ఇచ్చాయి.
Similar News
News January 22, 2025
ఆస్పత్రిలో ప్రముఖ నటుడు.. సాయం కోసం ఎదురుచూపు
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘డుంకీ’లో నటించిన వరుణ్ కులకర్ణి తీవ్ర కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తోటి నటుడు రోషన్ శెట్టి ఇన్స్టాలో పోస్ట్ చేశారు. వరుణ్ వైద్య ఖర్చులను సైతం భరించలేని స్థితిలో ఉన్నాడని తెలుపుతూ ఇండస్ట్రీ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వరుణ్ ‘స్కామ్ 1992’ & ‘ది ఫ్యామిలీ మ్యాన్’ (ప్రైమ్ వీడియో) వంటి సిరీస్లలో కనిపించారు.
News January 22, 2025
BRSకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
TG: బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో భారీ ఊరట లభించింది. బీఆర్ఎస్ నల్లగొండ దీక్షకు కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోగా సభ నిర్వహించుకోవాలని సూచించింది. కాగా ఈ నెల 21న నల్లగొండలో దీక్ష చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. కానీ స్థానిక పోలీసులు ఈ సభకు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
News January 22, 2025
ఎలా ఆడాలో రోహిత్కు చెప్పక్కర్లేదు: రహానే
రోహిత్ శర్మ పదేళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ఆడబోతున్నారు. రేపు J&Kతో మ్యాచ్లో ముంబై తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ సందర్భంగా ముంబై కెప్టెన్ రహానే మాట్లాడుతూ ‘రోహిత్ ఏంటో అందరికీ తెలుసు. నేషనల్, ఇంటర్నేషనల్ ఏ మ్యాచ్ ఆడినా ఒకేలా ఉంటాడు. ఆట గురించి అతనికి బాగా తెలుసు. ఏం చేయాలో ఇతరులు చెప్పాల్సిన అవసరం లేదు. అతడిచ్చే ఇన్ పుట్స్ మాకు చాలా ముఖ్యం. రోహిత్ తిరిగి ఫామ్లోకి వస్తాడనే నమ్మకముంది’ అని చెప్పారు.