News April 12, 2024

నిమిషాల్లోనే అయిపోయాయి

image

హైదరాబాద్, బెంగళూరు మధ్య ఈనెల 25న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు దాదాపు అయిపోయాయి. పేటీఎం ఇన్‌సైడర్‌ ద్వారా ఇవాళ ఉదయం 11 గంటలకు టికెట్ల అమ్మకం ప్రారంభించగా నిమిషాల్లోనే 35 వేల మందికిపైగా లాగిన్‌ అయ్యారు. ఎంత ట్రై చేసినా టికెట్లు దొరకడం లేదని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్లన్నీ బ్లాక్ మార్కెట్‌కు తరలించారని ఆరోపిస్తూ పోస్టులు పెడుతున్నారు.

Similar News

News March 16, 2025

గోద్రా అల్లర్లపై అది తప్పుడు ప్రచారం: మోదీ

image

గుజరాత్ గోద్రా అల్లర్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అల్లర్లుగా పేర్కొనడం అనేది తప్పుడు ప్రచారమని తెలిపారు. 2002 తర్వాత 22 ఏళ్లలో గుజరాత్‌లో పెద్ద అల్లరి జరగలేదని, ఆ రాష్ట్రం శాంతియుతంగా ఉందని చెప్పారు. ఆ సమయంలో కేంద్రంలో తమ ప్రత్యర్థులు అధికారంలో ఉండటంతో తమపై వచ్చిన ఆరోపణలను నిలబెట్టాలని చూశారన్నారు. అయితే న్యాయవ్యవస్థ తమను నిర్దోషులుగా తేల్చిందని పేర్కొన్నారు.

News March 16, 2025

నాన్ వెజ్ ఎవరు తినకూడదంటే?

image

కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. కానీ అందరికీ మాంసాహారం సరిపడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భిణులు ఎక్కువగా నాన్ వెజ్ తినకూడదు. ఇందులో ఉండే కొవ్వు, కొలెస్ట్రాల్ వీరికి హానికరం. గుండె జబ్బులు, షుగర్ ఉన్నవారు కూడా ఇది తినకపోవడమే బెటర్. ఇందులో ఉండే సోడియం రక్తపోటును పెంచుతుంది. అలర్జీ, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం ఉన్నవారు నాన్ వెజ్ తింటే జీర్ణ సమస్యలు వస్తాయని అంటున్నారు.

News March 16, 2025

PHOTOS: స్టైలిష్ లుక్‌లో రామ్ చరణ్

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చారు. వైట్ షర్ట్, బ్లూ జీన్స్ ధరించిన ఆయన కళ్లజోడుతో కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. చెర్రీ లేటెస్ట్ లుక్స్ అదిరిపోయాయని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న RC16లో రామ్ చరణ్ నటిస్తున్నారు.

error: Content is protected !!