News August 31, 2024

GOOD NEWS: కాసేపట్లో పింఛన్ల పంపిణీ

image

AP: రాష్ట్రంలో ఒక రోజు ముందుగా నేడు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి లబ్ధిదారులకు నగదు ఇవ్వాలని జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 65 లక్షల మందికి రూ.2,730 కోట్ల మొత్తాన్ని సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ తిరిగి అందించనున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్వహించనున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.

Similar News

News October 22, 2025

కార్తీక మాసంలో దీపాల విశిష్ఠత

image

కార్తీక మాసంలో సూర్యుడు తుల-వృశ్చిక రాశుల్లో, చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు. దీంతో సూర్యకాంతి తగ్గుతుంది. సూర్యాస్తమయం తర్వగా అవుతూ చీకటి దట్టంగా ఉంటుంది. అప్పుడు మన శరీరమూ కాస్త బద్దకిస్తుంది. చీకట్లను పారదోలడంతోపాటు మన శక్తి పుంజుకునేందుకు దీపాలను వెలిగించాలని పండితులు చెబుతున్నారు. ఉదయం నెయ్యితో, సాయంత్రం నువ్వుల నూనెతో వెలిగించడం శుభప్రదమంటున్నారు.

News October 22, 2025

నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు నేటి నుంచి 3 రోజుల పాటు యూఏఈలో పర్యటించనున్నారు. ఇవాళ 10amకు హైదరాబాద్ నుంచి దుబాయ్ బయలుదేరుతారు. వచ్చే నెల 14-15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు వివిధ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా మూడు రోజుల్లో రోడ్ షోతో పాటు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ కానున్నారు.

News October 22, 2025

కార్తీకం: ప్రమిదల్లో ఎన్ని వత్తులు ఉండాలి?

image

కార్తీక మాసంలో ప్రమిదలో రెండు వత్తులను వెలిగిస్తే శాంతి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. 3 వత్తులు ధనవృద్ధినీ, నాలుగు ఐశ్వర్యాన్నీ, ఐదు అఖండ సంపదల్నీ, ఏడు మోక్షాన్నీ ప్రసాదిస్తాయంటున్నారు. మనలో ఉండే పంచతత్వాలకు నిదర్శనంగా 5 రుచులతో ఉండే ఉసిరికపైనా దీపాన్ని వెలిగించవచ్చని పేర్కొంటున్నారు. అయితే ఒక వత్తిని వెలిగించినా పుణ్యం లభిస్తుందని వివరిస్తున్నారు.