News December 10, 2024

ఆధార్ ఉన్న వారికి శుభవార్త

image

AP: ఆధార్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజలు సులభంగా ఆధార్ సేవలు వినియోగించుకునేలా వెయ్యి ఆధార్ కిట్ల కొనుగోలుకు రూ.20 కోట్లు మంజూరు చేస్తూ CM చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. వీలైనంత త్వరగా గ్రామ-వార్డు సచివాలయాల్లో వెయ్యి ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. అటు జనన-మరణ ధ్రువపత్రాలు పొందేందుకు JAN 1న కొత్త వెబ్‌సైటును ప్రారంభించాలన్నారు.

Similar News

News April 19, 2026

సెన్సస్ పేరుతో మోసాలు.. జాగ్రత్త!

image

AP: కేంద్రం చేపట్టిన జనగణన పేరుతో సైబర్ నేరగాళ్లు చేసే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని NTR జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ప్రజలకు సూచించారు. సెన్సస్ సిబ్బందిమంటూ ఇళ్ల వద్దకు వచ్చి OTPలు అడిగితే చెప్పొద్దని, వేలిముద్రలు, ఐరిస్‌కు ఒప్పుకోవద్దని స్పష్టం చేశారు. అనుమానం ఉంటే 1855 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలన్నారు. కాగా ప్రస్తుతం <<19674967>>సెల్ఫ్ ఎన్యూమరేషన్<<>> జరుగుతుండగా, మే 1 నుంచి జనగణన మొదలవనుంది.

News April 19, 2026

రేపు రైతుభరోసా నిధులు విడుదల.. సీఎం షెడ్యూల్ ఇదే

image

TG: రైతుభరోసా రెండో విడత నిధులు విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి రేపు భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. ఆలయ అభివృద్ధి పనుల భూమిపూజలో పాల్గొంటారు. అనంతరం మేడిగడ్డకు చేరుకొని డ్యామ్ సైట్‌ను పరిశీలిస్తారు. అక్కడి నుంచి కాటారం వెళ్లి బహిరంగ సభలో పాల్గొని నిధులు విడుదల చేయనున్నారు.

News April 19, 2026

పాక్‌లో రేపు చర్చలు.. డీల్ చేసుకోవాల్సిందే: ట్రంప్

image

ఇరాన్‌తో చర్చలకు తమ బృందం రేపు సాయంత్రానికి పాకిస్థాన్ చేరుకుంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. డీల్ కుదుర్చుకోకపోతే ప్రతీ పవర్ ప్లాంట్, బ్రిడ్జ్‌లను ధ్వంసం చేస్తామని ఇరాన్‌ను హెచ్చరించారు. హార్ముజ్‌లో ఫ్రెంచ్, యూకే నౌకలపై ఇరాన్ బోట్లు దాడి చేయడం సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.