News February 16, 2025
G-PAY వాడే వారికి శుభవార్త

గూగుల్ పేలో త్వరలోనే AI ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా యూజర్లు వాయిస్ కమాండ్లతోనే UPI లావాదేవీలు చేయవచ్చు. ప్రస్తుతం సంస్థ దీనిపై ప్రయోగాలు చేస్తుండగా, త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా చదువులేని వారు కూడా సులభంగా లావాదేవీలు చేయవచ్చని సంస్థ అంచనా వేస్తోంది. అన్ని భారతీయ భాషలను ఇందులో ఇంక్లూడ్ చేసేలా గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది.
Similar News
News April 18, 2026
భద్రాచలం, బాసర ఆలయాలకు మహర్దశ

TG: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన భద్రాచలం, బాసర ఆలయాల అభివృద్ధికి టెండర్లు ఖరారయ్యాయి. ఈ మేరకు రూ.586 కోట్లతో భద్రాచలం, రూ.225 కోట్లతో బాసర దేవస్థానాల అభివృద్ధి పనులు జరగనున్నాయి. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయ పున:నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి <<19580372>>భూమిపూజ<<>> చేయడం తెలిసిందే.
News April 18, 2026
గ్యాస్ బుకింగ్స్ తగ్గాయి: కేంద్రం

దేశవ్యాప్తంగా LPG గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ తగ్గిందని కేంద్రం తెలిపింది. రోజువారీ బుకింగ్స్ 46-50 లక్షల మధ్య ఉన్నాయని చెప్పింది. సిలిండర్ల సరఫరా కూడా స్థిరంగా కొనసాగుతోందని, ఎక్కడా కొరత లేదని పేర్కొంది. పెట్రోల్, డీజిల్ సప్లై సాధారణంగానే జరుగుతున్నట్లు వెల్లడించింది. కాగా ఇరాన్, US శాంతి ఒప్పందానికి దగ్గరవడం, హార్ముజ్ జలసంధిని తెరవడంతో దేశంలో LPG కష్టాలు తప్పనున్నాయి.
News April 18, 2026
TCS ఘటన ‘కార్పొరేట్ జిహాద్’: మహారాష్ట్ర సీఎం

TCS నాసిక్ క్యాంపస్లో <<19663286>>మత మార్పిడి<<>> వ్యవహారం జిహాద్ లాంటిదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ‘ఈ జిహాద్ను మేం వివిధ రూపాల్లో చూశాం. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ వచ్చాయి. వాటి కంటే ఈ కార్పొరేట్ జిహాద్ ఇంకా తీవ్రమైనది. ఇది ఓ కంపెనీ ఆఫీసులోనే జరిగిందా? లేక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నాం’ అని తెలిపారు.


