News January 24, 2025

కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫ్రీగా మ్యాచ్ చూడొచ్చు

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దాదాపు 13 ఏళ్ల తర్వాత రంజీల్లో ఆడనున్నారు. ఈ నెల 30న రైల్వేస్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఆయన బరిలోకి దిగుతారు. ఈ క్రమంలో ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ జరిగే అరుణ్ జైట్లీ స్టేడియంలోకి ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించాలని నిర్ణయించింది. కాగా విరాట్ చివరిసారి 2012లో రంజీ మ్యాచ్‌లో ఆడారు.

Similar News

News February 24, 2026

‘ది కేరళ స్టోరీ-2’ టీజర్‌ను వెనక్కి తీసుకుంటాం: మేకర్స్

image

వివాదాస్పదమైన ‘ది కేరళ స్టోరీ-2’ టీజర్‌ను వెనక్కి తీసుకుంటామని కేరళ హైకోర్టుకు మేకర్స్ తెలిపారు. ఈ మూవీ మతవిద్వేశాలను రెచ్చగొట్టేలా ఉందంటూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ HCలో విచారణ జరిగింది. కేరళ సెక్యులర్ రాష్ట్రమని, కొన్ని ఘటనలను చూపి స్టేట్ మొత్తం ఇలాగే ఉందనడం సరికాదని HC అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంపైనా CBFCని నిలదీసింది.

News February 24, 2026

నేనూ కుల వివక్షను ఎదుర్కొన్నా: భట్టి

image

TG: రాజ్యాంగం సమాన హక్కులు ఇచ్చినప్పటికీ అంటరానితనం తగ్గలేదని Dy.CM భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. INC శిక్షణా తరగతుల్లో మాట్లాడుతూ తాను కూడా జీవితంలో కుల వివక్షను ఎదుర్కొన్నానని గుర్తుచేసుకున్నారు. ‘కులం అనేది సామాజిక వాస్తవం. దీన్ని అంగీకరించి మార్పు దిశగా అడుగులు వేయాలి. ఉన్నత విద్యావంతులూ కుల అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ సామాజిక సమానత్వం కోసం ప్రయత్నిస్తోంది’ అని చెప్పారు.

News February 24, 2026

IOCL దిగ్బోయ్ రిఫైనరీలో పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

<>IOCL <<>>దిగ్బోయ్ రిఫైనరీలో 48 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. BSc, డిప్లొమా అర్హత గలవారు NATS/NAPS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 24 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేసి ఎంపిక చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఫిబ్రవరి 28న అభ్యర్థులను ప్రకటిస్తారు. వెబ్‌సైట్: https://iocl.com