News August 29, 2024
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

దసరా, దీపావళి, ఛాత్ పండుగల సందర్భంగా 48 స్పెషల్ రైళ్లు ఏర్పాటు చేసినట్లు SCR అధికారులు తెలిపారు. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 25 మధ్య వీటిని నడపనున్నట్లు వెల్లడించారు. తిరుపతి-మచిలీపట్నం, కాకినాడ టౌన్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-నాగర్సోల్, కాచిగూడ-తిరుపతి మధ్య ఇవి ప్రయాణించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.
Similar News
News July 8, 2025
శ్రీరాముడు మా దేశంలోనే జన్మించాడు: నేపాల్ ప్రధాని

నేపాల్ PM కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాల్మీకి రాసిన అసలైన రామాయణం ఆధారంగా శ్రీరాముడు తమ దేశంలోనే జన్మించారని అన్నారు. శివుడు, విశ్వామిత్రుడు తమ ప్రాంతానికే చెందినవారన్నారు. ఈ విషయాన్ని చెప్పేందుకు దేశ ప్రజలు సంకోచించవద్దని పిలుపునిచ్చారు. అటు భారతదేశం ‘నకిలీ అయోధ్య’ని ప్రచారం చేస్తోందని కూడా ఆయన విమర్శించారు. కాగా మన పురాణాల ప్రకారం రాముడు అయోధ్యలో జన్మించారని ప్రసిద్ధి.
News July 8, 2025
పవన్ కళ్యాణ్ ఆగ్రహం

AP: MLA ప్రశాంతి రెడ్డిపై మాజీ MLA నల్లపరెడ్డి చేసిన <<16985283>>వ్యాఖ్యలను <<>>Dy.cm పవన్ ఖండించారు. ‘మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించడం YCP నేతలకు అలవాటుగా మారింది. ఈ అభ్యంతరకర వ్యాఖ్యలపై సమాజం సిగ్గుపడుతుంది. ఆ మాటలు బాధించాయి. వ్యక్తిగత జీవితాలే లక్ష్యంగా చేసిన ఈ వ్యాఖ్యలను ప్రజాస్వామికవాదులు ఖండించాలి. మహిళలను కించపరిచినా, అసభ్యంగా మాట్లాడినా చట్ట ప్రకారం చర్యలుంటాయి’ అని హెచ్చరించారు.
News July 8, 2025
వామ్మో రష్మిక.. గుర్తు పట్టారా!(PHOTO)

‘మైసా’లో లుక్తో ప్రేక్షకులను భయపెట్టిన హీరోయిన్ రష్మిక మరో లుక్ వైరలవుతోంది. ఓ మ్యాగజైన్కు ఇచ్చిన ఫొటో షూట్లో వెస్టర్న్ లుక్లో ఆమె గుర్తు పట్టకుండా మారిపోయారు. దీనిపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరేమో కొత్త లుక్ అదిరిపోయిందని కామెంట్లు చేస్తుండగా మరికొందరు దారుణంగా ఉందని ట్రోల్ చేస్తున్నారు. మరి నేషనల్ క్రష్ లేటెస్ట్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.