News July 18, 2024
రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఆ స్టేషన్లలో స్టాప్ల కొనసాగింపు

తెలుగు రాష్ట్రాల ప్రజల సౌకర్యార్థం పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు <<13647267>>స్టాప్<<>>లను కొనసాగిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఇందులో నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్ప్రెస్ రైళ్లకు మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్లలో హాల్టింగ్ పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. నర్సాపుర్- లింగంపల్లి, చెన్నై- HYD, భువనేశ్వర్- SEC రైళ్లు నల్గొండలో ఆగనున్నాయి. మొత్తం జాబితాను పైఫొటోలో చూడవచ్చు.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


