News August 23, 2024

రేషన్‌కార్డులు ఉన్న వారికి శుభవార్త

image

TG: రేషన్ కార్డులు ఉన్న వారికి రాయితీపై గోధుమలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం HYDలో మాత్రమే వీటిని అందిస్తుండగా, ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. అటు రూ.500కు గ్యాస్ సిలిండర్ల పంపిణీపైనా ఆయన సమీక్షించారు. వినియోగదారులకు సిలిండర్ సరఫరా అయిన 48 గంటల్లోగా వారి ఖాతాల్లో రాయితీ సొమ్ము జమ చేయాలని స్పష్టం చేశారు.

Similar News

News January 30, 2026

BC రిజర్వేషన్ జీవోలపై స్టే కొనసాగుతుంది: హైకోర్టు

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ఇచ్చిన జీవో(9, 41, 42)ల అమలుపై స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. 8 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే దాఖలైన వాటితోపాటు తమ వాదనలు కూడా వినాలని పలువురు కాంగ్రెస్ నేతలు వేసిన పిటిషన్లను హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం.మొహియుద్దీన్‌ల బెంచ్ విచారించింది.

News January 30, 2026

విటమిన్ D టాబ్లెట్లు ఎప్పుడు వాడాలంటే?

image

ఎముకల ఆరోగ్యానికి విటమిన్‌ డి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎముకల సమస్యలు, ఇతర కాల్షియం ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్‌ని తగ్గించే కాల్షియం, విటమిన్ డి ట్యాబ్లెట్స్ భోజనం తర్వాత తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి రెండు కలిపి ఉంటే భోజనం తర్వాత తీసుకోండి. విడివిడిగా ఉంటే కాస్తా గ్యాప్ ఇచ్చి తీసుకోవడం మంచిది. పైగా ఈ ట్యాబ్లెట్స్‌ని ఐరన్ ట్యాబ్లెట్స్‌తో అస్సలు కలపకూడదని చెబుతున్నారు.

News January 30, 2026

మోకాళ్ల నొప్పి రాగానే నడక ఆపేస్తున్నారా?

image

చాలామంది మోకాళ్ల నొప్పి రాగానే నడవడం ఆపేస్తారు. అయితే మోకాళ్ల నొప్పులు ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం పరిష్కారం కాదని, అది కీళ్లు బిగుసుకుపోయేలా చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నడవడం వల్ల కీళ్ల మధ్య జిగురు పెరిగి కండరాలు దృఢంగా మారి ఒత్తిడిని తట్టుకుంటాయని చెబుతున్నారు. ఈత, సైక్లింగ్ వంటివి ప్రయత్నించాలని.. మరుసటి రోజు నొప్పి పెరగకపోతే అది మీకు సురక్షితమని అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు.