News February 16, 2025
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్

శబరిమల అయ్యప్ప భక్తులకు ఆలయ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. 18 మెట్లు ఎక్కగానే దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మేరకు ఆలయం సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిని తొలగించాలని నిర్ణయించారు. భక్తులు ఈ మెట్లను ఎక్కగానే సన్నిధికి చేరుకోవడానికి ఎడమ వైపునకు మళ్లించేవారు. దీంతో దర్శనానికి 500 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిని దాటుకొని వెళ్లాల్సి వచ్చేది. మార్చి 14 నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది.
Similar News
News January 6, 2026
జ్యోతి యర్రాజీని కలిసిన మంత్రి లోకేశ్.. ₹30.35 లక్షల సాయం

AP: ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్స్షిప్ 100M హర్డిల్స్లో స్వర్ణ విజేతగా నిలిచిన జ్యోతి యర్రాజీని కలవడం సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలియజేశారు. ఆమె ధైర్యం, సంకల్పం దేశానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఏషియన్, కామన్వెల్త్ గేమ్స్లో సన్నద్ధతకు ₹30.35L సహాయాన్ని అందజేసినట్లు వెల్లడించారు. ఒలింపిక్ కలను సాకారం చేసే దిశలో ఆమెకు అండగా నిలుస్తామన్నారు.
News January 6, 2026
సంక్రాంతి సెలవులు ఖరారు చేసిన ప్రభుత్వం

TG: రాష్ట్రంలో సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ నెల 10 నుంచి 16 వరకు హాలిడేస్ ఉంటాయని ప్రకటించింది. తిరిగి శనివారం (17న) స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు ఈ సెలవుల షెడ్యూల్ను పాటించాలని ఆదేశించారు. అటు ఏపీలో ఈ నెల 10 నుంచి 18 వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
News January 6, 2026
ముస్తాఫిజుర్ ప్లేసులో స్టార్ బౌలర్ సోదరుడు?

బంగ్లాదేశ్ ప్లేయర్ <<18748860>>ముస్తాఫిజుర్<<>>ను KKR వదులుకున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో మార్కో జాన్సెన్ సోదరుడు డువాన్ను తీసుకోవాలని మాజీ ప్లేయర్ శ్రీవాస్త్ గోస్వామి సూచించారు. అదేమీ తప్పు ఎంపిక కాదని డువాన్ బ్యాటింగ్ కూడా చేస్తారన్నారు. ప్రస్తుతం SA20లో జోబర్గ్ సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న డువాన్ ఫామ్లో ఉన్నారు. 2023-IPLలో ముంబై తరఫున ఆడారు.


