News February 16, 2025

శబరిమల భక్తులకు గుడ్ న్యూస్

image

శబరిమల అయ్యప్ప భక్తులకు ఆలయ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. 18 మెట్లు ఎక్కగానే దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మేరకు ఆలయం సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిని తొలగించాలని నిర్ణయించారు. భక్తులు ఈ మెట్లను ఎక్కగానే సన్నిధికి చేరుకోవడానికి ఎడమ వైపునకు మళ్లించేవారు. దీంతో దర్శనానికి 500 మీటర్ల ఫుట్‌ ఓవర్ బ్రిడ్జిని దాటుకొని వెళ్లాల్సి వచ్చేది. మార్చి 14 నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది.

Similar News

News March 25, 2025

ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

image

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-CRRIలో 209 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్టెనోగ్రఫీలో ప్రావీణ్యం, ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు రూ.19,900-63,200, జూనియర్ స్టెనోగ్రాఫర్‌కు రూ.25,500-81,000 జీతం ఉంటుంది. అప్లికేషన్ ఫీజు రూ.500. ఏప్రిల్ 21 వరకు <>దరఖాస్తులకు<<>> అవకాశం ఉంది.

News March 25, 2025

IPL.. వ్యూస్‌లో తగ్గేదే లే!

image

IPL మ్యాచ్‌లు భారీగా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఈ నెల 22న KKR, RCB జట్ల మధ్య మ్యాచ్‌తో సీజన్ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 4 మ్యాచులు అలరించాయి. కాగా, స్టార్‌స్పోర్ట్స్‌లో 25.3 కోట్లు, జియో హాట్‌స్టార్‌లో 137 కోట్ల వ్యూస్ వచ్చినట్లు క్రీడావర్గాలు తెలిపాయి. అలాగే 5K కోట్ల నిమిషాల వాచ్ టైం నమోదైనట్లు వెల్లడించాయి. ధనాధన్ ఆటతో అలరిస్తున్న IPL ఏటికేడు భారీ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంటోంది.

News March 25, 2025

భార్య వీడియోలు షేర్ చేసే అర్హత భర్తకు లేదు: హైకోర్టు

image

భార్యతో సాన్నిహిత్యంగా గడిపిన వీడియోలను ఇతరులకు షేర్ చేసే అర్హత భర్తకు లేదని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇది భార్యాభర్తల మధ్య బంధాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. భార్యకు భర్త యజమాని కాదని, ఆమెకంటూ సొంత హక్కులు, కోరికలు ఉంటాయని తెలిపింది. తామిద్దరం కలిసున్న వీడియోలను తన భర్త వీడియో తీసి FBలో అప్‌లోడ్ చేయడంపై ఓ మహిళ పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

error: Content is protected !!