News March 15, 2025
SRH అభిమానులకు గుడ్ న్యూస్

సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి యోయో టెస్టు పాసయ్యారు. బెంగళూరులోని NCAలో నిర్వహించిన ఈ పరీక్షలో నితీశ్ 18.1 పాయింట్లు సాధించారు. దీంతో ఆయన రేపు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరతారు. కాగా ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో ఆయన గాయపడ్డారు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పక్కటెముకల గాయానికి గురయ్యారు. అప్పటినుంచి ఎన్సీఏలో పునరావాసం పొందుతున్నారు.
Similar News
News April 6, 2026
ఫ్యామిలీతో రష్మిక బర్త్ డే.. ఫొటోలు చూశారా?

నేషనల్ క్రష్ రష్మిక తన పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. పెళ్లి తర్వాత వచ్చిన తొలి బర్త్ డే కావడంతో భర్త విజయ్ దేవరకొండతో కలిసి ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. ఇరు కుటుంబ సభ్యులు ఒకచోట చేరి ఈ వేడుకను ఎంజాయ్ చేశారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న ఈ కొత్త జంట ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీతో ఎంతో సింపుల్గా ఉన్న ఈ స్టార్ కపుల్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
News April 6, 2026
గ్యాస్ సిలిండర్ దొరకట్లేదా? ఇది ఈజీగా పొందొచ్చు

నగరాలు, పట్టణాల్లోని వలస కార్మికులు, విద్యార్థుల కోసం 5 కేజీల FTL సిలిండర్ల పంపిణీని కేంద్రం వేగవంతం చేసింది. అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా వీటిని పొందవచ్చని విస్తృత ప్రచారం చేస్తోంది. ఆథరైజ్డ్ గ్యాస్ డీలర్ వద్దకు వెళ్లి ఏదైనా ఒక వ్యాలిడ్ ఐడీ కార్డు చూపిస్తే చాలని తెలిపింది. మార్చి 23 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6.6 లక్షల సిలిండర్లను డెలివరీ చేసినట్లు వివరించింది.
News April 6, 2026
దేశాభివృద్ధికి కట్టుబడిన పార్టీ BJP: చంద్రబాబు

AP: BJP 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా AP CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధికి కట్టుబడిన ఆ పార్టీ విప్లవాత్మక నిర్ణయాలతో ముందుకెళ్తోందన్నారు. కష్టకాలంలోనూ సమర్థమైన విధానాలతో దేశ రాజకీయాల్లో BJP తనదైన ముద్ర వేసిందని ప్రశంసించారు. అమరావతి నిర్మాణం సహా ఏపీ అభివృద్ధికి కేంద్రంలోని BJP ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.


