News April 15, 2025

విద్యార్థులకు గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు

image

AP: పాలిసెట్ దరఖాస్తుల గడువును సాంకేతిక విద్యాశాఖ పొడిగించింది. ఈ నెల 17 వరకు <>అప్లై<<>> చేసుకునేందుకు అవకాశం కల్పించింది. టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100 దరఖాస్తు ఫీజుగా ఉంది. ఏప్రిల్ 30న పరీక్ష జరగనుంది.

Similar News

News January 11, 2026

రాజాసాబ్‌కు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతంటే?

image

ఒక్కో మూవీకి ₹150 కోట్లు తీసుకుంటున్న ప్రభాస్ రాజాసాబ్‌కు మాత్రం ₹100 కోట్లే పారితోషికం తీసుకున్నారని టాలీవుడ్ టాక్. జోనర్ చేంజ్‌తో పాటు VFX, భారీ సెట్స్ కోసం అధికంగా ఖర్చవడంతో రెబల్ స్టార్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇక డైరెక్టర్ మారుతి ₹18 కోట్లు, యాక్టర్స్ సంజయ్ దత్ ₹5కోట్లు, రిద్ధి కుమార్ ₹3కోట్లు, మాళవికా మోహనన్ ₹2కోట్లు, నిధి అగర్వాల్ ₹1.5కోట్లు పొందారు. మొత్తం బడ్జెట్ రూ.400-450 కోట్లు.

News January 11, 2026

UPSC పరీక్షలకు కొత్త రూల్

image

UPSC పరీక్షల్లో పారదర్శకత పెంచేందుకు ఇకపై అభ్యర్థులందరికీ ‘ఫేస్ అథెంటికేషన్’ తప్పనిసరి చేశారు. Ai టెక్నాలజీతో పనిచేసే ఈ విధానాన్ని ఇప్పటికే NDA, CDS పరీక్షల్లో పైలట్ ప్రాజెక్టుగా విజయవంతంగా పరీక్షించారు. దీని వల్ల వెరిఫికేషన్ కేవలం 10 సెకన్లలోనే పూర్తవుతుందని, సమయమూ ఆదా అవుతుందని యూపీఎస్సీ ఛైర్మన్ అజయ్ కుమార్ తెలిపారు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడం వంటి మోసాలకు ఫేస్ అథెంటికేషన్‌తో చెక్ పడనుంది.

News January 11, 2026

ఠాక్రేలు తలచుకుంటే 10 నిమిషాల్లో ముంబై బంద్: రౌత్

image

ముంబై రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల వేళ శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ సంచలన కామెంట్స్ చేశారు. ఠాక్రే ఫ్యామిలీ పవర్ ఇప్పటికీ తగ్గలేదని, తలచుకుంటే కేవలం 10 నిమిషాల్లో ముంబైని స్తంభింపజేయగలరని వ్యాఖ్యానించారు. 20 ఏళ్ల తర్వాత BMC ఎన్నికల నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలవడంపై ఆయన ఈ విధంగా స్పందించారు. ఎన్నికల్లో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఠాక్రేల క్రేజ్ తగ్గలేదంటూ ధీమా వ్యక్తం చేశారు.