News March 3, 2025

విద్యార్థులకు GOOD NEWS.. నేరుగా ఖాతాల్లోకి డబ్బులు

image

TG: SC విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తోన్న ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ ఇక నుంచి నేరుగా స్టూడెంట్స్/పేరెంట్స్ ఖాతాల్లో జమ కానుంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో 9th, 10th చదువుతున్న డే స్కాలర్లకు ఏడాదికి ₹3,500, హాస్టళ్లలో ఉండే వారికి ₹7వేలు, మురికివాడల్లో నివసించే, కార్మికుల పిల్లలకు (1-10th) ఏడాదికి ₹3,500, హాస్టళ్లలో ఉండే 3-10 తరగతుల వారికి ఏడాదికి ₹8వేలు చెల్లిస్తారు. epass సైట్‌లో <>అప్లై<<>> చేయాలి.

Similar News

News March 21, 2025

సరికొత్త వివాదంలో OLA!

image

విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా కొత్త వివాదంలో చిక్కుకుంది. ఓలా వెల్లడించిన వాహన విక్రయాల సంఖ్య, వాహన రిజిస్ట్రేషన్ల సంఖ్యకు సరిపోలడం లేదని కేంద్రం గుర్తించింది. దీనిపై దర్యాప్తు చేయాలని ARAIని ఆదేశించింది. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా FEBలో 25వేల వాహనాలు అమ్మినట్లు OLA పేర్కొనగా వాహన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ల సంఖ్య 8,652గా ఉండటం గమనార్హం.

News March 21, 2025

కార్యకర్తల సమస్యలు తెలుసుకోవాలి: సీఎం చంద్రబాబు

image

AP: ప్రతి బుధవారం నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్యేలు, పార్టీ ఇంఛార్జ్‌లను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేలా కృషి చేయాలని తెలిపారు. అదే రోజు గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు తీసుకోవాలన్నారు. ఇంఛార్జ్ మంత్రులు తమకు కేటాయించిన జిల్లాలో నెలకు 2 రోజులు తప్పనిసరిగా పర్యటించాలని సీఎం అన్నారు.

News March 21, 2025

మాకూ ఆ పథకాన్ని వర్తింపజేయండి: ఈబీసీలు

image

TG: ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని తమకూ వర్తింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఈబీసీ సంక్షేమ సంఘం లేఖ రాసింది. అగ్రవర్ణ పేద యువతను సీఎం విస్మరించడం బాధకరమని లేఖలో పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరింది. కాగా ఈ పథకంతో రాష్ట్రంలో 5 లక్షల మందికి గరిష్ఠంగా రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది.

error: Content is protected !!