News March 10, 2025
షుగర్ బాధితులకు GOOD NEWS

డయాబెటిస్ రోగులకు అవసరమైన ఔషధాల భారం తగ్గనుంది. దేశీయ ఫార్మా కంపెనీలు త్వరలో Empagliflozin జనరిక్ వెర్షన్ ఉత్పత్తికి సిద్ధమవుతున్నాయి. మార్చి 11 నుంచి ఈ డ్రగ్పై పేటెంటు ముగుస్తుండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం రూ.60గా ఉన్న ట్యాబ్లెట్ జనరిక్లో రూ.9-14కే అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం ప్రస్తుతం దేశంలో 10.1 కోట్ల మంది షుగర్ పేషంట్లు ఉన్నారు.
Similar News
News March 10, 2025
మాజీ సీఎం ఇంట్లో IT రైట్స్.. అధికారుల వాహనంపై రాళ్ల దాడి

లిక్కర్ స్కాం కేసులో ఛత్తీస్గఢ్ మాజీ CM భూపేశ్ బఘేల్ ఇంట్లో ED సోదాల సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. బఘేల్, ఆయన కొడుకు చైతన్య నివాసాల్లో రైడ్స్ అనంతరం అధికారుల వాహనంపై INC కార్యకర్తలు రాళ్లు రువ్వారు. అటు తనపై కేసును SC కొట్టేసినా రైడ్స్ చేయడంపై బఘేల్ మండిపడ్డారు. తన ఇంట్లో రూ.33 లక్షల నగదు మాత్రమే దొరికిందని, కానీ పెద్ద సంఖ్యలో క్యాష్ కౌంటింగ్ మెషీన్లు తీసుకొచ్చి ED సెన్సేషన్ చేస్తోందన్నారు.
News March 10, 2025
7:36 వరకూ ఇండియన్స్ మేల్కోరట.. మరి మీరు?

కొందరు భారతీయులు ఉదయం 6 గంటలకే మేల్కొంటే మరికొందరు 8 దాటినా బెడ్పైనే ఉంటుంటారు. అందరి యావరేజ్ ప్రకారం భారతీయులు 7:36 AMకు నిద్ర లేస్తారని ‘వరల్డ్ పాపులేషన్ రివ్యూ’ వెల్లడించింది. అందరి కంటే ముందుగా మేల్కొనేది సౌతాఫ్రికా ప్రజలే. వారు 6:24కే నిద్ర లేస్తారు. ఆ తర్వాత కొలంబియా 6:31, కోస్టారికా 6:38, ఇండోనేషియా 6:55, జపాన్ &మెక్సికో 7:09, ఆస్ట్రేలియా 7:13, USAలో 7:20AMకి లేచి పనులు స్టార్ట్ చేస్తారు.
News March 10, 2025
అబ్బాయిలకూ పీరియడ్స్ వంటి సమస్య!

అమ్మాయిలకు పీరియడ్స్ ఎలాగో అబ్బాయిలూ ప్రతి నెలా IMS(ఇర్రిటబుల్ మేల్ సిండ్రోమ్) వంటి హార్మోన్ సమస్యతో బాధపడతారని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన వారిలో ఇది కనిపిస్తుంటుంది. నెలలో IMS సమయంలో వీరు ఎవరితో మాట్లాడరు. చిరాకు పడటం, రీజన్ లేకుండా కోప్పడతారు. దేనిపైనా ఇంట్రెస్ట్ చూపరు. ఇలాంటి సమయంలో వారితో ఆర్గ్యుమెంట్ చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. మీకు ఇలానే అనిపిస్తుందా? COMMENT