News March 10, 2025

షుగర్ బాధితులకు GOOD NEWS

image

డయాబెటిస్ రోగులకు అవసరమైన ఔషధాల భారం తగ్గనుంది. దేశీయ ఫార్మా కంపెనీలు త్వరలో Empagliflozin జనరిక్ వెర్షన్‌ ఉత్పత్తికి సిద్ధమవుతున్నాయి. మార్చి 11 నుంచి ఈ డ్రగ్‌పై పేటెంటు ముగుస్తుండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం రూ.60గా ఉన్న ట్యాబ్లెట్ జనరిక్‌లో రూ.9-14కే అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం ప్రస్తుతం దేశంలో 10.1 కోట్ల మంది షుగర్ పేషంట్లు ఉన్నారు.

Similar News

News March 16, 2026

W.బెంగాల్.. 144 మంది అభ్యర్థులను ప్రకటించిన BJP

image

WB అసెంబ్లీ ఎన్నికల వేళ BJP 144 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్థానమైన భవానీపూర్ నుంచి ప్రతిపక్షనేత సువేందు అధికారిని బరిలో దించింది. నందిగ్రామ్‌లోనూ ఆయనే పోటీ చేస్తున్నారు. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో APR 23, 29వ తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అటు కేరళంలోనూ 47 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితాను BJP ప్రకటించింది.

News March 16, 2026

శుక్రుడు మరీ ఇంత స్లోనా?

image

సౌర కుటుంబంలో అత్యంత వింతైన గ్రహం శుక్రుడు. సాధారణంగా గ్రహాలకు తమ చుట్టూ తాము తిరగడానికి పట్టే సమయం(రోజు) కంటే, సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే సమయం (సంవత్సరం) ఎక్కువ. కానీ శుక్ర గ్రహం తన చుట్టూ తాను నెమ్మదిగా తిరుగుతుంది. అందుకే అక్కడ ఒక రోజు(243d) గడవకముందే ఒక సంవత్సరం(225d) పూర్తవుతుంది. ఈ కాలగమనం ఖగోళ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో

News March 16, 2026

ఎప్‌స్టీన్‌‌ ఫైల్స్ ప్రచారం.. పరువు నష్టం దావా వేసిన కేంద్ర మంత్రి కూతురు

image

కేంద్ర మంత్రి హర్దీప్ పూరీ కూతురు హిమాయని ఢిల్లీ హైకోర్టులో ₹10Crకు పరువు నష్టం దావా వేశారు. US లైంగిక నేరస్థుడు ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌తో తనకు సంబంధం ఉన్నట్లు కొందరు SMలో తప్పుడు ప్రచారం చేశారని ఆమె పేర్కొన్నారు. ఆ కంటెంట్‌ను తొలగించాలని కోరారు. కాగా ఎప్‌స్టీన్‌తో హర్దీప్‌ పూరీకి సంబంధాలున్నట్లు 2014-15 మధ్య విమర్శలు రాగా ఆయన ఖండించారు.