News January 18, 2025
టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్?

భారత స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. ఇటీవల గాయం కారణంగా CTకి దూరమవుతున్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇంగ్లండ్తో సిరీస్కు మేనేజ్మెంట్ ఆయనకు విశ్రాంతి కల్పించింది. దీంతో ఇవాళ ప్రెస్ మీట్లో బుమ్రా ఆడే విషయమై రోహిత్ ఎలాంటి ప్రకటన చేస్తారని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
Similar News
News February 11, 2025
GBS కేసులపై మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటన

మహారాష్ట్రలో ఇప్పటివరకు 192 మంది గిలియన్ బార్ సిండ్రోమ్ (<<15225307>>GBS<<>>) అనుమానిత రోగులను గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 167 మందికి GBS ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపింది. మొత్తం 7 అనుమానిత మరణాలు నమోదయ్యాయని, ఒకరు GBSతో మరణించినట్లు తేలిందని పేర్కొంది. రోగుల్లో 20-29 ఏళ్ల వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.
News February 11, 2025
మంచి మాట – పద్యబాట

నిండు నదులు పాఱు నిల్చి గంభీరమై
వెర్రివాగు పాఱు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ వినురవేమ.
భావం: గొప్ప నదులు నిదానంగా, గంభీరంగా ప్రవహిస్తాయి. పిల్లవాగులు అతివేగంగా గట్లుదాటి పొర్లి ప్రవహిస్తాయి. అట్లే యోగ్యుడు నిదానంగా, గంభీరంగా మాట్లాడతాడు. నీచుడు బడ బడ వాగుతూ ఉంటాడు.
News February 11, 2025
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్ 2025 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. https://jeemain.nta.nic.in/ వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చు. అయితే వెబ్సైట్లో ఎర్రర్ వస్తోందని, రిజల్ట్స్ చూపించడం లేదని పలువురు అభ్యర్థులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల 22 నుంచి 29 వరకు ఈ పరీక్షను నిర్వహించారు. ఫైనల్ ఆన్సర్ కీ కోసం ఇక్కడ <