News March 28, 2024
టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్?

TG: రాష్ట్రంలోని టెట్ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పెంచిన టెట్ ఫీజును తగ్గించనున్నట్లు సమాచారం. ఫీజుల పెంపు వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన తగ్గించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో ఒక పేపర్కు రూ.200 ఉండగా రూ.1000, రెండు పేపర్లకు రూ.300 ఉండగా రూ.2000 వరకు పెంచారు. దాదాపు 3 లక్షల మంది టెట్ రాయనున్నారు.
Similar News
News January 25, 2026
ముద్దు సీన్లకు భయపడే ఛాన్స్లు వదులుకున్నా: సోనమ్ బజ్వా

ముద్దు సన్నివేశాల్లో నటించాలనే భయంతోనే బాలీవుడ్ అవకాశాలు వదులుకున్నానని నటి సోనమ్ బజ్వా అన్నారు. ‘‘ముద్దు సీన్లలో నటిస్తే పంజాబ్లో ఇమేజ్ ఏమవుతుందోనని భయపడ్డాను. నా ఫ్యామిలీ ఎలా అర్థం చేసుకుంటుందో, అభిమానులు ఏమనుకుంటారో అనుకున్నాను. పేరెంట్స్తో డిస్కస్ చేయడానికి సిగ్గుపడ్డాను. చివరికి అడిగితే ‘సినిమా కోసమేగా. తప్పేముంది’ అనడంతో షాకయ్యాను’’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
News January 25, 2026
టాస్ గెలిచిన టీమ్ ఇండియా.. టీమ్స్ ఇవే

న్యూజిలాండ్తో మూడో టీ20లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్కు విశ్రాంతినిచ్చి వారి స్థానంలో బుమ్రా, బిష్ణోయ్ను తుదిజట్టులోకి తీసుకున్నారు.
IND: శాంసన్, అభిషేక్, ఇషాన్, సూర్య, హార్దిక్, దూబే, రింకూ సింగ్, హర్షిత్, బుమ్రా, కుల్దీప్, బిష్ణోయ్.
NZ: కాన్వే, సీఫర్ట్, రచిన్, ఫిలిప్స్, చాప్మన్, మిచెల్, సాంట్నర్, జెమీసన్, హెన్రీ, సోథీ, జాకబ్.
News January 25, 2026
రోహిత్ శర్మ, హర్మన్ప్రీత్ కౌర్కు పద్మశ్రీ అవార్డ్స్

ఈ ఏడాది క్రీడల రంగంలో 8 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. క్రికెట్లో రోహిత్ శర్మతో పాటు హర్మన్ప్రీత్ కౌర్కు లభించాయి. అలాగే మహిళల హాకీ గోల్కీపర్ సవితా పునియా, అథ్లెట్ ప్రవీణ్ కుమార్, పంజాబ్కు చెందిన బల్దేవ్ సింగ్, MP నుంచి భగవాన్దాస్ రైక్వార్, పుదుచ్చేరి కె.పజనివేల్ను అవార్డులు వరించాయి. జార్జియాకు చెందిన వ్లాదిమిర్ మెస్త్విరిష్విలికి మరణానంతరం పద్మశ్రీ ప్రకటించారు.


