News March 20, 2024

తిరుమల వెళ్లేవారికి గుడ్‌న్యూస్

image

శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమలలో రద్దీ తగ్గింది. పరీక్షల సమయం కావడంతో భక్తజనం పెద్దగా కనిపించడం లేదు. క్యూ కాంప్లెక్స్‌లు ఖాళీగా ఉన్నాయి. దర్శనం సులువుగానే అవుతోంది. రూ.300 టికెట్ కొన్నవారికి గంటలోనే దర్శనం పూర్తవుతోందని అధికారులు తెలిపారు. ఇక నిన్న స్వామివారిని 63,251మంది దర్శించుకోగా.. వారిలో 20,989మంది తలనీలాలు ఇచ్చారన్నారు. రూ.4.14 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని వెల్లడించారు.

Similar News

News December 11, 2025

ఇంకెన్నాళ్లు.. అప్డేట్ అవ్వండి!

image

ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో దరఖాస్తు పత్రాలు(200KB), ఫొటోలు (100KB), సిగ్నేచర్ (50KB) వంటి అప్‌లోడ్‌‌కు సైజు పరిమితులు ఉండటంపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నెట్ వేగం తక్కువగా ఉండేదని.. నేటి హైస్పీడ్ నెట్ యుగంలో నాణ్యత తగ్గించడానికి ఇతర యాప్స్ వాడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఫైల్ అప్‌లోడ్ చేశాక సర్వరే దాని పరిమాణాన్ని తగ్గించుకునేలా మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు. దీనిపై మీకామెంట్?

News December 11, 2025

మేడిగడ్డ భద్రత, రిపేర్లపై NDSA సమీక్ష

image

TG: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఛైర్మన్ అనిల్ జైన్ హైదరాబాద్‌లో ఉన్నత నీటిపారుదల అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఆనకట్టల భద్రతకు తీసుకున్న చర్యలను ఆయన సమీక్షిస్తున్నారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతుల కోసం అథారిటీ చేసిన సిఫార్సుల అమలుపై కూడా ఆయన సమావేశంలో చర్చిస్తున్నారు. కాగా ప్రాజెక్టుల పరిస్థితిపై ప్రభుత్వం ఇప్పటికే అథారిటీకి నివేదిక అందించింది.

News December 11, 2025

నిద్రలో పేరెంట్స్ నిర్లక్ష్యం.. పసికందు కన్నుమూత

image

తల్లిదండ్రులు నిద్రలో ఒరగడంతో 26 రోజుల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన UPలో జరిగింది. తమ బిడ్డ సూఫియాన్‌ను తల్లిదండ్రులు మంచంపై మధ్యలో పెట్టుకుని పడుకున్నారు. నిద్రమత్తులో ఇద్దరు బేబీవైపు తిరగడంతో శిశువు మధ్యలో ఇరుక్కుని ఊపిరాడక చనిపోయాడు. ఉదయం పాలు పట్టేందుకు తల్లి ప్రయత్నించగా స్పందించకపోవడంతో ఆసుపత్రికి తరలించగా శ్వాస ఆడక మరణించినట్లు వైద్యులు తెలిపారు. పేరెంట్స్.. జాగ్రత్త.
Share It