News February 17, 2025
బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త

తెలంగాణ నుంచి బెంగళూరు వెళ్లే TGSRTC బస్సుల్లో డిస్కౌంట్ ఇస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఈ రూట్లో నడిచే అన్ని సర్వీసుల్లో రానుపోనూ టికెట్ ధరలో 10శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు. దీని వల్ల ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.160 వరకు ఆదా అవుతుందన్నారు. దీంతో సూపర్ లగ్జరీ, NAC సీటర్, రాజధాని, AC సీటర్, AC స్లీపర్ ధరలు తగ్గుతాయని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News January 31, 2026
ఫిబ్రవరి 12న బ్యాంకులు బంద్!

కేంద్రం తెచ్చిన 4 కార్మిక చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్తో FEB 12న జరగనున్న దేశవ్యాప్త <<18979407>>సమ్మెకు<<>> బ్యాంకు సంఘాలు మద్దతిచ్చాయి. కార్మిక సంఘాలతో కలిసి స్ట్రైక్లో పాల్గొనాలని AIBEA, AIBOA, BEFI నిర్ణయించాయి. ఉద్యోగులెవరూ విధులకు హాజరుకాకూడదని డిసైడ్ అయ్యాయి. దీంతో ఆరోజు బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. వారానికి 5 రోజుల పనిదినాలకు డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు.
News January 31, 2026
తిరుమల నెయ్యి.. క్లీన్ చిట్ వచ్చినట్లు YCP ప్రచారం: పయ్యావుల

AP: తిరుమలలో లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని 2022లో CFTRI రిపోర్ట్ ఇచ్చిందని, దాన్ని YCP తొక్కిపెట్టిందని మంత్రి పయ్యావుల ఆరోపించారు. ‘మేం వచ్చాకే కల్తీ వ్యవహారం బయటపడింది. నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలున్నాయని NDDB రిపోర్టులో తేలింది. అయినప్పటికీ సిట్ క్లీన్ చిట్ ఇచ్చినట్లు YCP ప్రచారం చేసుకుంటోంది. YCP హయాంలో TTD నిబంధనల మార్పుతోనే దుర్మార్గపు పనులకు పునాది పడింది’ అని మండిపడ్డారు.
News January 31, 2026
పాడి పశువులకు ‘దశరథ గడ్డి’తో కలిగే లాభాలివే

☛ దశరథ గడ్డిని ఆవులు, గేదెలకు ప్రతిరోజూ 2 కేజీల చొప్పున ఇస్తే పాల దిగుబడి, వెన్నశాతం వృద్ధి చెందుతుంది.
☛ మేకలు, గొర్రెలకు దాణా బదులుగా 50 శాతం ఈ గడ్డిని ఆహారంగా ఇస్తే వాటి పెరుగుదల బాగుంటుంది.
☛ లేయర్ (ఆడ) కోడిపిల్లలకు ఆహారంలో 6 శాతం ఈ గడ్డిని ముక్కలు చేసి వేస్తే గుడ్ల నాణ్యత పెరుగుతుంది.
☛ కుందేళ్లు, పందులకు ఈ గడ్డిని అందిస్తే వాటి పెరుగుదల వేగంగా ఉంటుంది.


