News December 7, 2024
GOOD NEWS: LIC స్కాలర్షిప్ స్కీమ్.. రేపటి నుంచి దరఖాస్తులు
టెన్త్/ఇంటర్/డిప్లొమాలో కనీసం 60% మార్కులు సాధించిన పేద విద్యార్థుల కోసం LIC గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ స్కీమ్ను లాంచ్ చేసింది. రేపటి నుంచి ఈనెల 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. 2021-22, 2022-23, 2023-24 విద్యాసంవత్సరాల్లో పాసైన వారు, 2024-25లో ఫస్టియర్ చదువుతున్న వారు అర్హులు.
వెబ్సైట్: <
Similar News
News January 21, 2025
‘నా భార్య టార్చర్ పెడుతోంది.. చనిపోతున్నా’
భార్య వేధింపులకు మరో భర్త బలయ్యాడు. ఇండోర్(MP)కు చెందిన నితిన్ ఆత్మహత్య చేసుకున్నాడు. విడాకులు తీసుకున్నా తన భార్య హర్ష, అత్త, భార్య సోదరీమణులు వేధిస్తున్నారని సూసైడ్ నోట్ రాశాడు. ‘మహిళలు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు. వాటిని మార్చాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా’ అని తెలిపాడు. యువకులు పెళ్లి చేసుకోవద్దని, ఒకవేళ చేసుకుంటే ముందే అగ్రిమెంట్ చేసుకోవాలని పేర్కొన్నాడు.
News January 21, 2025
బ్రాండ్ వాల్యూ పరంగా ప్రపంచంలో పెద్ద ఐటీ కంపెనీలు
*యాక్సెంచర్ (అమెరికా)- రూ.3.47 లక్షల కోట్లు
*టీసీఎస్ (భారత్)- రూ.1.77 లక్షల కోట్లు
*ఇన్ఫోసిస్ (భారత్)- రూ.1.36 లక్షల కోట్లు
*ఐబీఎం కన్సల్టింగ్ (అమెరికా)- రూ.85వేల కోట్లు
*NTT DATA (జపాన్)- రూ.83వేల కోట్లు
*క్యాప్జెమినీ (ఫ్రాన్స్)- రూ.82వేల కోట్లు
*కాగ్నిజెంట్ (అమెరికా)- రూ.75వేల కోట్లు
*HCL టెక్ (భారత్)- రూ.74వేల కోట్లు
*విప్రో (భారత్)- రూ.50వేల కోట్లు
*Fujitsu (జపాన్)- రూ.34వేల కోట్లు
News January 21, 2025
కల్లు గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు
AP: రాష్ట్రంలోని కల్లు, గీత కులవృత్తిదారులకు ప్రభుత్వం మద్యం దుకాణాలు కేటాయించింది. అన్ని జిల్లాలకు కలిపి మొత్తం 335 మద్యం షాపులు ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా నూతన మద్యం పాలసీ ప్రకారం ప్రభుత్వం రాష్ట్రంలో 3,396 వైన్ షాపులకు లైసెన్సులు జారీ చేసింది. ఇందులో 10 శాతం దుకాణాలను గీత కులాలకు కేటాయించింది.