News January 20, 2025
మొబైల్ రీఛార్జ్లపై GOOD NEWS

రీఛార్జ్ చేయకపోయినా సిమ్ ఎక్కువ కాలం యాక్టివేట్గా ఉండేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ తెచ్చింది. జియో, ఎయిర్టెల్, Vi యూజర్స్ 90 రోజులు, BSNLకు 180 రోజుల పాటు యాక్టివేట్గా ఉంటాయని తెలిపింది. అనంతరం సిమ్ Deactivate కాకుండా ఉండాలంటే నెట్వర్క్ను అనుసరించి రీఛార్జ్ చేసుకోవాలంది. ఇది రూ.20తో స్టార్ట్ చేయాలని ట్రాయ్ సూచించింది. 2 సిమ్ కార్డులు వాడేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
Similar News
News February 13, 2025
మణిపుర్లో రాష్ట్రపతి పాలన

మణిపుర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ఇటీవలే CM బీరెన్ సింగ్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మణిపుర్లో మైతేయి, కుకీ వర్గాల మధ్య మే 2023 నుంచి ఘర్షణలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. అయితే CM ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నారని సొంత పార్టీ MLAలే విమర్శించారు. విశ్వాస పరీక్ష జరిగితే MLAలు విప్ను ధిక్కరించే అవకాశం ఉండటంతో బీజేపీ అధిష్ఠానం సూచనతో ఆయన తప్పుకున్నారు.
News February 13, 2025
కొత్త రూల్స్.. లేటైతే డబుల్ ఛార్జ్

FEB 17 నుంచి కొత్త FASTag రూల్స్ అమల్లోకి రానున్నాయి. FASTagలో తగిన బ్యాలెన్స్ లేకపోవడం, KYC పెండింగ్, ఛాసిస్, వెహికల్ నంబర్లు వేర్వేరుగా ఉంటే FASTag బ్లాక్లిస్టులోకి వెళ్తుంది. టోల్ గేటుకు చేరుకునే సమయానికి 60min కంటే ఎక్కువ టైం FASTag ఇన్యాక్టివ్, బ్లాక్ లిస్టులో ఉంటే ఎర్రర్ చూపుతుంది. స్కాన్ చేసిన 10 min తర్వాత ఇన్యాక్టివ్లోకి వెళ్లినా ఆ లావాదేవీ తిరస్కరిస్తారు. అప్పుడు డబుల్ టోల్ కట్టాలి.
News February 13, 2025
పర్యాటకంలో 20 శాతం వృద్ధి ఉండాలి: సీఎం

AP: పర్యాటక రంగ అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందులో 20 శాతం వృద్ధి ఉండాలని సూచించారు. మెగా ప్రాజెక్టుగా శ్రీశైలం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతి, విశాఖ, అమరావతి, రాజమండ్రిలో టూరిజం హబ్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా బీచ్, క్రూయిజ్ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు.