News March 31, 2025
GOOD NEWS: తగ్గిన టోల్ ఛార్జీలు

హైదరాబాద్-విజయవాడ NHపై టోల్ ఛార్జీలు తగ్గాయి. ఈ అర్ధరాత్రి (ఏప్రిల్ 1) నుంచి తగ్గిన రుసుములు అమల్లోకి రానున్నాయి. ఈ హైవేపై 3 టోల్ ప్లాజాలు (పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు) ఉన్నాయి. పంతంగి వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు రూ.15, రెండువైపులా కలిపి రూ.30, బస్సు, ట్రక్కులకు రూ.50, రెండువైపులా కలిపి రూ.75 వరకు తగ్గించారు. చిల్లకల్లు వద్ద అన్ని వాహనాలకు ఒక వైపుకు రూ.5, ఇరువైపులా కలిపి రూ.10కి కుదించారు.
Similar News
News April 21, 2025
రేపే ఇంటర్ ఫలితాలు

TG: రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్, సెకండియర్ రిజల్ట్స్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించనున్నారు. మార్చి 5 నుంచి 25 వరకు జరిగిన పరీక్షలకు దాదాపు 9.96 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అందరికంటే వేగంగా Way2Newsలో ఫలితాలు తెలుసుకోవచ్చు. ఒకే క్లిక్తో రిజల్ట్స్ వస్తాయి. మార్క్స్ లిస్ట్ను ఈజీగా షేర్ చేసుకోవచ్చు.
News April 21, 2025
26న ఎచ్చెర్లకు సీఎం.. వేట నిషేధ భృతికి శ్రీకారం

AP: సీఎం చంద్రబాబు ఈ నెల 26న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో పర్యటించనున్నారు. మత్స్యకారులకు రూ.20వేల చొప్పున చేపల వేట నిషేధ భృతిని అందజేస్తారు. తర్వాత రాష్ట్రంలోని లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి. కాగా సముద్రంలో మత్స్య సంపద పునరుత్పత్తి కోసం ఈ నెల 14 నుంచి జూన్ 15 వరకు వేట నిషేధం అమల్లో ఉంటుంది. ఆ సమయంలో మత్స్యకారులను ఆదుకోవడానికి ప్రభుత్వం కొన్నేళ్లుగా భృతిని అందజేస్తోంది.
News April 21, 2025
నేటి నుంచి 57 నగరాల్లో కాంగ్రెస్ ప్రెస్మీట్లు

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ED ఛార్జిషీట్ ఫైల్ చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ్టి నుంచి ఈనెల 24 వరకు ప్రెస్ మీట్లు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. ‘కాంగ్రెస్ నిజాలు, బీజేపీ అబద్ధాలు’ క్యాంపెయిన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడతామంది. దేశంలోని 57 నగరాల్లో పార్టీ నేతలు ప్రెస్మీట్లు నిర్వహిస్తారని వెల్లడించింది. ఈ మేరకు సిటీస్, నేతల పేర్లతో జాబితా విడుదల చేసింది.