News October 21, 2024

జియోకు కోటి మంది యూజర్లు గుడ్ బై!

image

రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెంచిన తర్వాత రిలయన్స్ జియోకు యూజర్లు షాక్ ఇచ్చారు. రెండవ త్రైమాసికంలో 1.07కోట్ల మంది జియోకు గుడ్ బై చెప్పినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే 5G సబ్ స్క్రైబర్స్ బేస్ మాత్రం 17మిలియన్లు పెరిగి 147 మిలియన్లకు చేరింది. ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం రూ.181.7 నుంచి రూ.195.1కి పెరిగింది. వినియోగదారుల్ని కోల్పోవడం తమ లాభాలపై పెద్దగా ప్రభావం చూపదని కంపెనీ పేర్కొంది.

Similar News

News October 21, 2024

ఎలక్షన్స్ తర్వాత అమెరికా ‘బబుల్’ బరస్టేనా!

image

US ఎలక్షన్స్ తర్వాత ఏం జరుగుతుందోనని ప్రపంచమంతా భయపడుతోంది. అక్కడి బ్యాంకులు $500bns నష్టాల్లో ఉన్నాయి. లిక్విడిటీ లేదు. ఇక జాతీయ అప్పు $35trns. గోల్డ్, పెట్రోల్ లేకుండానే ప్రింట్ చేస్తున్న డాలర్లు చిత్తుకాగితాలతో సమానమని కియోసాకి లాంటి ఆంత్రప్రెన్యూర్స్, ఎకానమిస్టులు బాహాటంగా చెప్తున్నారు. BRICS కరెన్సీ వస్తే ఇక ఆగమాగమేనని, US బుడగ ఏ క్షణమైనా టప్‌మని పేలొచ్చని వార్నింగ్ ఇస్తున్నారు. మీ కామెంట్.

News October 21, 2024

BREAKING: బంగాళాఖాతంలో అల్పపీడనం

image

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా వాయవ్య దిశగా పయనిస్తూ బలపడి వాయుగుండం, ఆపై తుఫానుగా మారుతుందని పేర్కొంది. ఈ తుఫానుకు ‘దానా’గా నామకరణం చేశారు. దీని ప్రభావంతో రానున్న రోజుల్లో ఏపీలో వర్షాలు పడతాయని, ఈ నెల 24 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

News October 21, 2024

రబాడ@300

image

దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబాడ అరుదైన క్లబ్‌లో చేరారు. SA తరఫున టెస్టుల్లో 300 వికెట్లు తీసిన ఆరో ప్లేయర్‌గా నిలిచారు. బంగ్లాదేశ్‌తో మ్యాచులో ఈ ఘనత సాధించారు. 65 టెస్టుల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం. ఈ జాబితాలో స్టెయిన్(439), పొలాక్(421), ఎన్తిని(390), డొనాల్డ్(330), మోర్కెల్(309) రబాడ కన్నా ముందు ఉన్నారు. ఓవరాల్‌గా ఈ జాబితాలో మురళీధరన్(800) తొలి స్థానంలో ఉన్నారు.