News May 24, 2024
తమిళనాడులో గూగుల్ పెట్టుబడులు

తమిళనాడులో గూగుల్ పిక్సల్ పెట్టుబడులు పెడుతున్నట్లు సీఎం స్టాలిన్ వెల్లడించారు. ఈ పెట్టుబడుల ద్వారా డ్రోన్స్, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను గూగుల్ నెలకొల్పనుంది. చెన్నైకు సమీపంలో ఉన్న శ్రీపెరంబదూర్లో ఈ యూనిట్ స్థాపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అమెరికా పర్యటనలో TN మంత్రుల బృందం గూగుల్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. గూగుల్ ఎంత మేర పెట్టుబడులు పెట్టనుందనే వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 16, 2026
27 సెక్యూరిటీ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్

శాశ్వత ప్రాతిపదికన 27 సెక్యూరిటీ మేనేజర్ పోస్టుల భర్తీకి పంజాబ్ & సింధ్ బ్యాంక్ నోటిఫికేషన్ ఇచ్చింది. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 23-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎగ్జామ్, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.64,820-93,960గా ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ 5-5-26. పూర్తి వివరాలకు www.punjabandsind.bank.in చూడండి.
News April 16, 2026
అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

రిలయన్స్ కమ్యూనికేషన్స్ గ్రూప్కు చెందిన లోన్ అకౌంట్లను బ్యాంకులు ఫ్రాడ్గా పేర్కొని దర్యాప్తు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ అనిల్ అంబానీ వేసిన పిటిషన్ను SC కొట్టివేసింది. ఈ దశలో స్టే విధించలేమని ధర్మాసనం పేర్కొంది. తొలుత బాంబే HC సింగిల్ బెంచ్ అంబానీకి ఫేవర్గా తీర్పునిచ్చింది. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, IDBI పిటిషన్ను విచారించిన డివిజన్ బెంచ్ దీనిని పక్కన పెట్టింది.
News April 16, 2026
మార్కెట్ షేర్లో మారుతీ రివర్స్ గేర్

2026 ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ మార్కెట్ షేర్ 39.26%కి పడిపోయింది. 13 ఏళ్లలో ఇదే కనిష్ఠం. ఒకప్పుడు సగానికి పైగా మార్కెట్ను ఏలిన మారుతీ.. పెరుగుతున్న పోటీ, కస్టమర్ల అభిరుచులు మారడంతో వరుసగా మూడో ఏడాదీ వెనకబడింది. 2020 నుంచి చూస్తే కంపెనీ ఏకంగా 12% మార్కెట్ షేర్ను కోల్పోయిందని SIAM గణాంకాలు చెబుతున్నాయి. ఇతర కంపెనీల SUVs హవా పెరగడమే మారుతీకి నెగటివ్గా మారినట్లు స్పష్టమవుతోంది.


