News January 4, 2025
తెలుగులో ఉత్తర్వులతో పాలన పారదర్శకం: మంత్రులు

AP: ప్రభుత్వ ఉత్తర్వులను <<15057376>>తెలుగులోనూ<<>> ఇవ్వాలన్న నిర్ణయంపై మంత్రులు అచ్చెన్న, సత్యప్రసాద్, రామ్ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. 90% మంది తెలుగు మాట్లాడే ప్రజలున్న రాష్ట్రంలో తెలుగులో ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా పరిపాలన పారదర్శకంగా మారనుందని తెలిపారు. తెలుగు భాషకు CM సముచిత గౌరవం ఇస్తున్నారని కొనియాడారు. మాతృభాషను గత ప్రభుత్వం అవమానించిందని మండిపడ్డారు.
Similar News
News December 24, 2025
అతిథికి రెడ్ కార్పెట్.. మనోళ్లకు రైలు టాయిలెట్!

అంతర్జాతీయ ఫుట్బాల్ స్టార్ మెస్సీ కోసం రూ.89కోట్లు ఖర్చు చేస్తే.. మన క్రీడాకారులు రైలు టాయిలెట్ <<18652348>>పక్కన<<>> నరకయాతన అనుభవించారు. భారత క్రీడారంగంలో వెలుగుచూసిన ఈ వివక్ష అందరినీ నివ్వెరపరుస్తోంది. గెలిచినప్పుడు భుజం తట్టే పాలకులు వారి ప్రయాణ కష్టాలను కూడా పట్టించుకోరా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మెడలో మెడల్స్ కోరుకునే వ్యవస్థ క్రీడాకారుల ఆత్మగౌరవాన్ని పట్టించుకోదా? దీనిపై మీరేమంటారు? COMMENT
News December 24, 2025
VHT: ఒకే రోజు 22 సెంచరీలు

విజయ్ హజారే ట్రోఫీలో తొలి రోజు ఆటగాళ్లు శతకాల మోత మోగించారు. ఇవాళ ఏకంగా 22 మంది ప్లేయర్లు సెంచరీలు చేశారు. ఒడిశా ప్లేయర్ స్వస్తిక్ ఏకంగా డబుల్ సెంచరీ బాదారు. బిహార్ నుంచి వైభవ్ సహా ముగ్గురు ప్లేయర్లు శతకాలు చేశారు. స్టార్ ప్లేయర్లు కోహ్లీ, రోహిత్తో పాటు ఇషాన్ కిషన్ ఈ లిస్ట్లో ఉన్నారు. కాగా బిహార్ ప్లేయర్ గని 32 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీతో సరికొత్త రికార్డు నమోదు చేశారు.
News December 24, 2025
సిల్వర్ ఈజ్ ది న్యూ గోల్డ్.. ‘యాపిల్’ను వెనక్కు నెట్టి!

2025లో వెండి ధరలు రికార్డు స్థాయిలో పుంజుకుంటున్నాయి. అటు ఆర్థిక నిల్వగా, ఇటు పారిశ్రామిక లోహంగా వెండికి ఆదరణ పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణం. తాజా లెక్కల ప్రకారం వెండి మార్కెట్ విలువ సుమారు $4.04 ట్రిలియన్లకు చేరుకుంది. దీంతో ‘APPLE’ కంపెనీ మార్కెట్ విలువ ($4.02 ట్రిలియన్లు)ను వెండి అధిగమించి మూడో స్థానానికి చేరింది. ఫస్ట్ ప్లేస్లో గోల్డ్ ($31.41T), రెండో స్థానంలో NVIDIA($4.61T) ఉంది.


