News January 4, 2025
తెలుగులో ఉత్తర్వులతో పాలన పారదర్శకం: మంత్రులు

AP: ప్రభుత్వ ఉత్తర్వులను <<15057376>>తెలుగులోనూ<<>> ఇవ్వాలన్న నిర్ణయంపై మంత్రులు అచ్చెన్న, సత్యప్రసాద్, రామ్ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. 90% మంది తెలుగు మాట్లాడే ప్రజలున్న రాష్ట్రంలో తెలుగులో ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా పరిపాలన పారదర్శకంగా మారనుందని తెలిపారు. తెలుగు భాషకు CM సముచిత గౌరవం ఇస్తున్నారని కొనియాడారు. మాతృభాషను గత ప్రభుత్వం అవమానించిందని మండిపడ్డారు.
Similar News
News January 10, 2026
MSVG టికెట్ ధరల పెంపు.. రెండు రోజుల కిందటే అనుమతి?

చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టికెట్ ధరల <<18817046>>పెంపునకు<<>> TG ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఈ నెల 8వ తేదీ ఉండటంతో 2 రోజుల కిందటే టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. కాసేపట్లో టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా జీవో బయటకు రావడం చర్చనీయాంశమైంది. ఈ మూవీ ఎల్లుండి థియేటర్లలోకి రానుండగా, రేపు ప్రీమియర్లు వేయనున్నారు.
News January 10, 2026
మార్స్కైనా వెళ్లాల్సిందే: బంగ్లా క్రికెటర్

భారత్తో సంబంధాలు దెబ్బతినడంతో మన దేశంలో T20WC ఆడేందుకు <<18807855>>BCB <<>>నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై వరల్డ్ కప్ కోసం ఎంపికైన బంగ్లా ఆల్రౌండర్ మహెదీ హసన్ స్పందించారు. ‘అనిశ్చితి అనేది మేనేజ్మెంట్ సమస్య. దానిని అఫీషియల్స్ డీల్ చేయాల్సి ఉంటుంది. మా పని క్రికెట్ ఆడటం మాత్రమే. మీరు ఆటగాళ్లను మార్స్కు పంపినా వెళ్లి ఆడతారు. దానిపై వారికి ఎలాంటి అభ్యంతరం ఉండదు’ అని వ్యాఖ్యానించారు.
News January 10, 2026
మరోసారి చర్చకు టికెట్ రేట్ల పెంపు!

ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపుపై TG ప్రభుత్వ నిర్ణయాలు అభిమానులను అయోమయానికి గురిచేస్తున్నాయి. మొన్న అర్ధరాత్రి జారీ చేసిన ‘రాజాసాబ్’ టికెట్ రేట్ల పెంపు మెమోను నిన్న HC సస్పెండ్ చేసింది. జీవో 120 ప్రకారం టికెట్ రేట్ రూ.350 మించకూడదని స్పష్టం చేసింది. ఇంతలోనే తాజాగా ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్స్కు <<18817046>>అనుమతి<<>> ఇవ్వడం, టికెట్ రేట్ను రూ.600గా నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి. COMMENT


