News January 4, 2025

తెలుగులో ఉత్తర్వులతో పాలన పారదర్శకం: మంత్రులు

image

AP: ప్రభుత్వ ఉత్తర్వులను <<15057376>>తెలుగులోనూ<<>> ఇవ్వాలన్న నిర్ణయంపై మంత్రులు అచ్చెన్న, సత్యప్రసాద్, రామ్ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. 90% మంది తెలుగు మాట్లాడే ప్రజలున్న రాష్ట్రంలో తెలుగులో ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా పరిపాలన పారదర్శకంగా మారనుందని తెలిపారు. తెలుగు భాషకు CM సముచిత గౌరవం ఇస్తున్నారని కొనియాడారు. మాతృభాషను గత ప్రభుత్వం అవమానించిందని మండిపడ్డారు.

Similar News

News January 26, 2025

పద్మ పురస్కారాలపై సీఎం రేవంత్ అసంతృప్తి

image

TG: పద్మ పురస్కారాల్లో రాష్ట్రానికి కేవలం రెండు మాత్రమే రావడంపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం వివక్ష చూపించిందని మండిపడ్డారు. గద్దర్, గోరటి వెంకన్న, అందెశ్రీ, చుక్కా రామయ్యవంటి పలువురు ప్రముఖుల పేర్లను తాము ప్రతిపాదించినా పరిగణించకపోవడం తెలంగాణ ప్రజలందర్నీ అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 139 పద్మ అవార్డుల్లో రాష్ట్రానికి కనీసం 5 కూడా ఇవ్వకపోవడమేంటంటూ సీఎం ప్రశ్నించారు.

News January 26, 2025

‘పద్మ’గ్రహీతలకు అభినందనలు: చిరంజీవి

image

‘పద్మ’ పురస్కారాలు గెలుచుకున్న తెలుగువారికి మెగాస్టార్ చిరంజీవి ట్విటర్లో అభినందనలు తెలిపారు. ‘పద్మవిభూషణ్ గెలుచుకున్న డాక్టర్ నాగేశ్వరరెడ్డికి, పద్మభూషణ్ పొందిన నా స్నేహితులు నందమూరి బాలకృష్ణ, అజిత్ కుమార్, శ్రీ అనంత నాగ్, శేఖర్ కపూర్, శోభన, పద్మశ్రీ వచ్చిన అర్జిత్ సింగ్, మాడుగుల నాగఫణిశర్మ సహా పద్మ అవార్డీలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.

News January 26, 2025

కవులు, కళాకారులు తెలంగాణలో లేరా?: RSP ప్రశ్న

image

TG: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలపై BRS నేత RS ప్రవీణ్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన మందకృష్ణ మాదిగ, డా.నాగేశ్వర్ రెడ్డికి అభినందనలు చెబుతూనే కేంద్రంపై మండిపడ్డారు. సాహిత్యం, కళల రంగంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. TGలో కవులు, కళాకారులు లేనే లేరా? కేవలం APలోనే ఉన్నారా? అంటూ ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షాలను ప్రశ్నించారు.