News October 8, 2025
రెండు సిరప్లపై ప్రభుత్వం నిషేధం

TG: రాష్ట్రంలో రెండు దగ్గు మందులను ప్రభుత్వం నిషేధించింది. Relife CF, Respifresh-TR సిరప్లను వాడొద్దని స్పష్టం చేసింది. ఈ రెండు దగ్గు సిరప్లలో అత్యంత విషపూరితమైన Diethylene Glycol (DEG) ఉందని పేర్కొంది. వీటి వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని తెలిపింది. కాగా మధ్యప్రదేశ్లో Coldrif సిరప్ వల్ల 20 మంది చిన్నారులు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
Similar News
News October 8, 2025
ఏడు కొండలు ఏడు శక్తి కేంద్రాలు – వృషభాద్రి

తిరుమల కొండల్లో ఐదవది ‘వృషభాద్రి’. సాధన చేసే భక్తుడు ఏకాగ్రతతో ధ్యానించినప్పుడు, అతని కుండలిని శక్తి విశుద్ధ చక్రాన్ని చేరుకుంటుంది. అంటే.. దాదాపు 80% ఆధ్యాత్మిక ప్రయాణం పూర్తైనట్లే. ఈ దశలో సంసార బంధాలన్నీ తెగిపోయి, మనస్సు బంధాలు లేని వృషభం(ఎద్దు) వలె కేవలం పరమాత్మ వైపే వేగంగా పరుగులు తీస్తుంది. ఈ శక్తిమంతమైన భావాన్ని సూచిస్తూనే ఈ కొండకు ‘వృషభాద్రి’ అనే దివ్య నామం వచ్చింది. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News October 8, 2025
పిల్లల ఫొటోలు తీస్తున్నారా? ఇలా చేయండి!

చాలామంది తమ పిల్లల బాల్యాన్ని, మధుర జ్ఞాపకాలను కెమెరాతో బంధించి కొద్దిరోజుల్లోనే డిలీట్ చేయడం చూస్తుంటాం. ఇంతదానికి ఫొటోలు తీయడం ఎందుకు? అలా చేయకుండా వారి పేరిట ఓ మెయిల్ క్రియేట్ చేసి అందులో స్టోర్ చేయొచ్చని పలువురు సూచిస్తున్నారు. వారి ఫొటోలు, వీడియోలను mailలో స్టోర్ చేసి యుక్త వయసు వచ్చాక వారికిస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదూ. మరి ఆలస్యమెందుకు.. ఇప్పుడే మెయిల్ క్రియేట్ చేసేయండి. SHARE IT
News October 8, 2025
కరూర్ తొక్కిసలాటపై రిషబ్ శెట్టి ఏమన్నారంటే?

తమిళనాడులో హీరో విజయ్ ర్యాలీలో చోటు చేసుకున్న <<17885395>>తొక్కిసలాట<<>> ఘటన దురదృష్టకరమని ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి అన్నారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొన్నారు. ఇది ఒక్కరి తప్పు కాదని సమష్టి పొరపాటుగా భావిస్తున్నానని అభిప్రాయపడ్డారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందని పేర్కొన్నారు. పోలీసులు, ప్రభుత్వంపై నింద వేయడం సులభమేనని, అంత జనం ఉన్నప్పుడు వారిని నియంత్రించడం సమస్యేనని పేర్కొన్నారు.