News January 28, 2025
సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రభుత్వం క్లారిటీ

AP: సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేమని సీఎం చంద్రబాబు చెప్పినట్లుగా కొందరు చేస్తున్న ప్రచారం అవాస్తవమని ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ విభాగం వెల్లడించింది. ‘దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర ఎకానమీపై సీఎం మాట్లాడారు. అంతేగానీ పథకాలు అమలు చేయలేమని ఆయన ఎక్కడా చెప్పలేదు. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దు’ అని ట్వీట్ చేసింది.
Similar News
News February 9, 2025
రోహిత్ శర్మ రాణించాలని అభిమానుల పూజలు

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్శర్మ తిరిగి ఫామ్ అందుకోవాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్ తిరిగి పుంజుకునేలా అతనిని ఆశీర్వదించాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నారు. దేవుడి దగ్గర రోహిత్ ఫొటోలు పెట్టి ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే.
News February 8, 2025
ఢిల్లీ నుంచి గల్లీకి చేరిన కేజ్రీవాల్

నిన్నటివరకు మోదీకి ఎదురునిలిచే నేతల్లో కేజ్రీవాల్ ఒకరు. ప్రస్తుతం మాత్రం ఆప్తో పాటు తానూ ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో పరిస్థితి తలకిందులుగా మారింది. పంజాబ్లో అధికారంతో పాటు పలురాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు గెలిచి జోరుమీదున్న ఆప్కు ఢిల్లీ ఓటమి కోలుకోలేని దెబ్బ. లిక్కర్ స్కాం,శీశ్మహాల్, యమున నది కలుషితం తదితర అంశాలతో పాటు సొంత పార్టీ నేతల్లో వ్యతిరేకత తదితర అంశాలు కేజ్రీవాల్ ఓటమికి కారణమయ్యాయి.
News February 8, 2025
‘అఖండ-2’లో విలన్గా క్రేజీ యాక్టర్?

సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం సినిమాల్లో విభిన్న పాత్రలతో అలరించిన నటుడు ఆది పినిశెట్టి మరోసారి బోయపాటి శ్రీను మూవీలో విలన్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. బోయపాటి తెరకెక్కిస్తోన్న ‘అఖండ-2’లో ప్రతినాయకుడి పాత్రలో ఆది కనిపిస్తారని సినీవర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. బోయపాటి తెరకెక్కించిన ‘సరైనోడు’ సినిమాలో ఆది విలనిజంకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.