News January 7, 2025
ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం నిర్ణయం
AP: ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.500 కోట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇవాళ నెట్ వర్క్ ఆసుపత్రులతో అధికారులు సమావేశమయ్యారు. ఏప్రిల్ 1 నుంచి బీమా పద్ధతిలో ఎన్టీఆర్ వైద్య సేవ అందించాలని డిసైడ్ చేశారు. మరోవైపు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రులు వైద్య సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
Similar News
News January 18, 2025
సైఫ్పై దాడి.. నిందితుడి అరెస్ట్!
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ఛత్తీస్గఢ్లో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దుర్గ్ రైల్వే స్టేషన్లో RPF పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు అక్కడికి బయల్దేరారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ముంబైకి తరలించనున్నారు. షాలీమార్ జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ జనరల్ కోచ్లో అతడు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News January 18, 2025
పవన్ ఆఫీస్పై డ్రోన్.. డీజీపీకి ఫిర్యాదు
AP: మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు ఆఫీస్పై గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు. మధ్యాహ్నం 1.30 నుంచి 1.50 గంటల మధ్య డ్రోన్ ఆ ప్రాంతంలో తిరిగింది. దీంతో జనసేన నేతలు డీజీపీతోపాటు గుంటూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
News January 18, 2025
తిరుమల, తిరుపతిలో అపచారాలు.. నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ
AP: తిరుమలలో వరుసగా అపచారాలు జరుగుతుండటంపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యింది. అన్ని ఘటనలపై నివేదిక ఇవ్వాలని టీటీడీని ఆదేశించింది. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ రేపు, ఎల్లుండి తిరుమలలో పర్యటించనున్నారు. అధికారులతో సమావేశమై వివరాలు సేకరించనున్నారు. తిరుపతిలో తొక్కిసలాట, తిరుమల లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం, రూ.300 టికెట్ల స్కామ్, తాజాగా కొండపై ఎగ్ బిర్యానీ కలకలం రేపిన విషయం తెలిసిందే.