News November 19, 2024

ప్రభుత్వ ప్రోత్సాహం.. ఒక్కరోజే 131 ఈవీల కొనుగోలు

image

TG: ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నట్లు రవాణా శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజే 131 ఈవీలు కొన్నట్లు వెల్లడించింది. వీటిలో టూవీలర్లు-121, కార్లు-6, ఆటో రిక్షాలు-3, ఒక గూడ్స్ క్యారేజ్ వాహనం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఈవీలపై రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ మినహాయింపును ప్రభుత్వం 2026 DEC 31 వరకు పొడిగించింది. గతంలో ఉన్న వాహన పరిమితి సంఖ్యనూ ఎత్తేసింది.

Similar News

News November 21, 2025

ఢిల్లీ హైకోర్టులో గౌతమ్ గంభీర్‌కు ఊరట

image

భారత్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో లైసెన్స్ లేకుండా కొవిడ్-19 మందులు నిల్వ చేసి, పంపిణీ చేశారని గంభీర్, కుటుంబ సభ్యులు, ఛారిటబుల్ ఫౌండేషన్‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిని కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ తీర్పు చెప్పారు. ఫిర్యాదును కొట్టివేస్తున్నట్టు వెల్లడించారు. పూర్తి తీర్పు రావాల్సి ఉంది.

News November 21, 2025

ఆముదంతో ఎన్నో లాభాలు

image

చాలామంది ఇళ్లల్లో లభించే ఆముదం నూనెలో ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్‌ ఇ, యాంటి ఆక్సిడెంట్‌ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు, చర్మానికి కూడా మేలు చేస్తాయి. ఇది వాడటం వల్ల జుట్టుకు అవసరమైన పూర్తి పోషణ అందుతుంది. జుట్టు రాలడం, చిట్లి పోవడం తగ్గి, కుదుళ్లు బలపడతాయి. ఎక్కువ జిడ్డుగా ఉంటుందని చాలామంది దీన్ని వాడటం మానేస్తారు. కానీ జుట్టు పెరగాలని కోరుకునేవారు ఆముదం నూనె ఎంచుకోవచ్చు.

News November 21, 2025

కృష్ణా జలాలపై జగన్ హెచ్చరిక

image

AP: కృష్ణా జలాల విషయంలో మరోసారి సంక్లిష్ట పరిస్థితి ఏర్పడిందని YCP అధినేత YS జగన్ ట్వీట్ చేశారు. CM చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపైనే రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే KWDT-II విచారణలో తెలంగాణ 763 TMCలను డిమాండ్ చేస్తోందని, బచావత్ ట్రైబ్యునల్ APకి కేటాయించిన 512 TMCల్లో ఒక్క చుక్కనూ కోల్పోకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని హెచ్చరించారు.