News August 1, 2024
భూ రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై ప్రభుత్వం దృష్టి

AP: భూ రిజిస్ట్రేషన్ విలువలను పెంచడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విజయవాడ, గుంటూరు, విశాఖ వంటి పట్టణాలు, నగరాల్లో ప్రస్తుతం ఉన్న విలువ కంటే 5 నుంచి 10 శాతం పెరగొచ్చని సమాచారం. అలాగే కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువ ఉంటే బహిరంగ మార్కెట్ విలువలు తక్కువ ఉన్నాయి. ఈ హెచ్చు తగ్గులపైనా అధికారులు దృష్టిసారించారు. ఈ శాఖపై రేపు CM చంద్రబాబు నిర్వహించే సమీక్షలో విలువ పెంపుపై క్లారిటీ రానుంది.
Similar News
News November 16, 2025
రాజ్యాంగం వల్లే చాయ్వాలా ప్రధాని అయ్యారు: CBN

AP: బీఆర్ అంబేడ్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు అందించారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ‘చాయ్వాలా మోదీ దేశానికి ప్రధాని కాగలిగారంటే రాజ్యాంగం వల్లే. మన రాజ్యాంగం అందించే స్ఫూర్తి చాలా గొప్పది. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుతూ న్యాయవ్యవస్థ కీలక బాధ్యత పోషిస్తోంది’ అని తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైకోర్టు న్యాయవాదులు నిర్వహించిన కార్యక్రమంలో సీఎం, CJI పాల్గొన్నారు.
News November 16, 2025
చంద్రబాబూ.. ఇదేనా మీ విజన్: జగన్

AP: చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు తక్కువగా ఉందని YS జగన్ ఆరోపించారు. 2025-26 FY తొలి 6 నెలల CAG గణాంకాలను Xలో షేర్ చేశారు. రెండేళ్ల కాలానికి పన్నుల వృద్ధి CAGR కేవలం 2.75% ఉండగా, ప్రభుత్వం పేర్కొంటున్న 12-15% వృద్ధి పూర్తిగా అవాస్తవమని విమర్శించారు. తమ హయాంలో పన్నుల వృద్ధి 9.87% ఉందన్నారు. కూటమి ప్రభుత్వ అప్పులు మాత్రం భారీగా పెరిగి రూ.2,06,959 కోట్లకు చేరాయని వెల్లడించారు.
News November 16, 2025
IPL 2026 వేలానికి స్టార్ ప్లేయర్లు

వచ్చే IPL సీజన్ కోసం మొత్తం 10 ఫ్రాంచైజీలు రిటైన్డ్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాయి. దీంతో స్టార్ క్రికెటర్లు వేలానికి వచ్చారు. ఆండ్రీ రస్సెల్, గ్లెన్ మాక్స్వెల్ , లివింగ్స్టోన్ వంటి ప్లేయర్లు బిడ్డింగ్లో టార్గెట్ కానున్నారు. అదే విధంగా పతిరణతో పాటు జోష్ ఇంగ్లిస్, బిష్ణోయి, జంపా, డేవిడ్ మిల్లర్, వెంకటేశ్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లు కూడా మినీ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.


