News July 17, 2024
స్కూళ్లకు ప్రభుత్వం ఆదేశాలు

AP: ఈ నెల 22 నుంచి 28 వరకు అన్ని స్కూళ్లలో <<13648551>>’శిక్షా సప్తాహ్’<<>> నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇందులో విద్యార్థులు, టీచర్లు, తల్లులను భాగస్వామ్యం చేయాలంది. జాతీయ విద్యావిధానం సంస్కరణలు తెలియజేయడమే దీని ఉద్దేశమంది. 22న బోధన అభ్యసన సామగ్రిని టీచర్లు ప్రదర్శించాలని, 27న అమ్మలతో కలిసి విద్యార్థులతో 35 మొక్కలు నాటించాలని, 28న విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు నిర్వహించాలని DEOలకు తెలిపింది.
Similar News
News November 27, 2025
పసిపిల్లలు సరిపడా పాలు తాగుతున్నారా?

ఆరు నెలల లోపు శిశువులకు తల్లి పాలను మించిన సంపూర్ణ ఆహారం లేదు. అయితే శిశువు తగినన్ని పాలు తాగుతున్నారో.. లేదో తెలుసుకోవడానికి వారి మూత్రాన్ని పరిశీలించాలంటున్నారు నిపుణులు. శిశువులు ప్రతి 4 నుంచి 6 గంటలకు మూత్ర విసర్జన చేస్తారు. ఆ యూరిన్ రంగు నీటిలా ఉంటే వాళ్లు పాలు సరిగ్గా తాగుతున్నారని అర్థం. అలాగే బిడ్డకు ప్రతి మూడుగంటలకు పాలివ్వాలి. రాత్రిపూట కూడా 2,3సార్లు పాలు పట్టించాలని చెబుతున్నారు.
News November 27, 2025
ANRFలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్( <
News November 27, 2025
నటిని పెళ్లి చేసుకున్న మాజీ క్రికెటర్

తమిళ బిగ్బాస్ ఫేమ్ సంయుక్త షణ్ముఘనాథన్ను మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కుమారుడు, IPL మాజీ ప్లేయర్ అనిరుద్ధ శ్రీకాంత్ వివాహమాడారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడంతో కుటుంబసభ్యుల సమక్షంలో జరిగినట్లు సినీవర్గాలు తెలిపాయి. సంయుక్త నటిగా, మోడల్గా గుర్తింపు పొందగా.. అనిరుద్ధ IPLలో 2008 నుంచి 14 వరకూ CSK, SRH జట్లకు ప్రాతినిధ్యం వహించారు. వివాహానికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.


