News March 25, 2024
టెట్ ఫీజు తగ్గించేందుకు ప్రభుత్వం యోచన?

TG: టెట్ ఒక్కో పేపర్ ఫీజును రూ.300 నుంచి రూ.1,000కి <<12907253>>పెంచడంపై<<>> అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్, హాస్టళ్లకు రూ.వేలు ఖర్చు పెడుతున్న తమపై ఫీజుల భారం వేయడం తగదని, వెంటనే తగ్గించాలని కోరుతున్నారు. ఈ వ్యవహారం సీఎం రేవంత్ దృష్టికి వెళ్లింది. ఫీజు పెంపు అధికారుల స్థాయిలోనే జరిగిందని CMO వర్గాలు ఆయనకు చెప్పాయట. సమస్య తీవ్రతరం కాకముందే ఫీజు తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 14, 2026
CEERIలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News January 14, 2026
విమానాలకు ‘పొగ’బెట్టిన భోగి

చెన్నైలో భోగి పండుగ విమాన రాకపోకలకు అంతరాయం కలిగిస్తోంది. పొగమంచుకు తోడు భోగి మంటలతో వచ్చిన పొగతో పూర్ విజిబిలిటీ ఏర్పడింది. దీంతో చెన్నై ఎయిర్పోర్టులో విమానాలు ల్యాండ్ కాలేకపోతున్నాయి. వాటిని డైవర్ట్ చేస్తున్నారు. అయితే సమయం గడిచేకొద్దీ విజిబిలిటీ పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా ప్రజలు ప్లాస్టిక్, రబ్బర్ టైర్లు కాల్చకుండా స్మోక్ ఫ్రీ సెలబ్రేషన్స్ చేసుకోవాలని TNPCB కోరింది.
News January 14, 2026
తెలుగు ప్రజలకు మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ సంక్రాంతి మీ జీవితాల్లో సరికొత్త ఆశయాలు, ఉన్నత లక్ష్యాలను నింపాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ పండుగ మన అన్నదాతలది. నిరంతరం శ్రమిస్తూ దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు కృతజ్ఞతలు తెలిపే పవిత్ర సమయం. ఈ సందర్భంగా సమాజంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నా’ అని Xలో పోస్ట్ చేశారు.


