News September 8, 2024
రిపేర్ల ఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది: చంద్రబాబు

AP: విజయవాడ వరద బాధితులకు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు రిపేర్లు చేపించేలా చర్యలు తీసుకుంటామని CM చంద్రబాబు తెలిపారు. అందుకయ్యే ఖర్చుని అవసరమైతే ప్రభుత్వమే సబ్సిడీ లేదా పూర్తిగా భరిస్తుందని తెలిపారు. ‘ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉన్నవాళ్లు సర్వం కోల్పోయారు. బాధితులను ఏ రకంగా ఆదుకోవాలో ఆలోచిస్తున్నాం. బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా చూస్తాం’ అని CBN చెప్పారు.
Similar News
News November 16, 2025
తిరుమలలో ఈ ఆలయాన్ని దర్శించుకున్నారా?

స్వామివారి పుష్కరిణికి వాయువ్యంలో ఉన్న వరాహస్వామి ఆలయాన్ని తప్పక దర్శించుకోవాలి. పురాణాల ప్రకారం.. విష్ణుమూర్తి వరాహావతారంలో భూమిని పైకెత్తారు. ఆయన అనుమతితోనే శ్రీనివాసుడు తిరుమలలో వెలిశారు. అందుకే, తిరుమలలో తనను దర్శించుకునే భక్తులందరూ ముందుగా భూవరాహస్వామిని దర్శించుకుంటారని శ్రీనివాసుడు చెప్పారు. ఇప్పటికీ శ్రీవారి దర్శనానికన్నా ముందు దర్శనం, నైవేద్యం వరాహస్వామికే సమర్పిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 16, 2025
134 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

భారత వాతావరణ శాఖ(IMD) 134 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు DEC 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MSc, BE, B.Tech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. PhD, ME, M.Tech కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. * మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News November 16, 2025
NSIC 70 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (NSIC)70 మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ, MBA, CA, CMA, BE, బీటెక్, LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, ST, PWBD, మహిళలకు ఫీజు లేదు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://nsic.co.in


