News July 12, 2024

అమరావతి కట్టడాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

image

AP: రాజధాని అమరావతిలోని కట్టడాల పటిష్ఠతపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయాలని నిర్ణయించింది. సచివాలయాల ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ భవనాల బేస్‌మెంట్లు, ఐఏఎస్, ఎన్జీఓల సముదాయాల పటిష్ఠతపై స్టడీ చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. వీటి పటిష్ఠత నిర్ధారణ బాధ్యతలను ఐఐటీ చెన్నైకి అప్పగించాలని నిర్ణయించారు. ఐఐటీ చెన్నై ఇచ్చే నివేదిక ఆధారంగా భవన నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

Similar News

News October 31, 2025

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

TG: ఇంటర్ బోర్డు పరీక్షల <>షెడ్యూల్ <<>>విడుదల చేసింది. రోజుకు 2 సెషన్స్(9AM-12PM, 2PM-5PM)చొప్పున FEB 2-21 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. 21న ఫస్టియర్, 22న సెకండియర్‌కు ENG ప్రాక్టికల్స్ ఉంటాయి. FEB 25-MAR 18 వరకు రాత పరీక్షలు కొనసాగనున్నాయి. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు రోజు మార్చి రోజు పరీక్షలుంటాయి. FEB 25న ఫస్టియర్, 26న సెకండియర్‌ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి.

News October 31, 2025

పంచ భూతాలే మానవ శరీరం

image

మానవ దేహం పంచభూతాలతో ఏర్పడింది. చర్మం, వెంట్రుకలు, కండరాలు భూతత్వానికి సంబంధించినవి. ఆకలి, నిద్ర, దాహం అగ్నితత్వానికి చెందినవి. నడవడం, పరుగెత్తడం వంటి కదలికలన్నీ వాయుతత్వం. మూత్రం, రక్తం, వీర్యం వంటి ద్రవాలు జలతత్వం కిందకి వస్తాయి. గరుడ పురాణం ప్రకారం.. ఆలోచన (చింత), శబ్దం, దుఃఖం (శోకం) అనేవి ఆకాశతత్వం లక్షణాలు. నూనెతో తలకు, ఒంటికి చేసే అభ్యంగనం ద్వారా ఈ సర్వేంద్రియాలకు శాంతి, శక్తి లభిస్తాయి.

News October 31, 2025

5,346 టీచర్ పోస్టులు.. దరఖాస్తు చేసుకున్నారా?

image

ఢిల్లీలో 5,346 TGT పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ, పీజీ, బీఈడీతో పాటు సీటెట్ ఉత్తీర్ణులైనవారు నవంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100, మహిళలు, SC, ST, దివ్యాంగులకు ఫీజు లేదు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.44,900 – రూ.1,42,400 అందుతుంది. వెబ్‌సైట్: https://dsssb.delhi.gov.in/