News July 27, 2024

ప్రభుత్వం మద్యం ధరలు భారీగా పెంచబోతోంది: హరీశ్

image

TG: ఎక్సైజ్ శాఖలో బడ్జెట్ అంచనాలను పరిశీలిస్తే రాబోయే రోజుల్లో ప్రభుత్వం బీర్లు, మద్యం ధరలు భారీగా పెంచబోతున్నట్లు అర్థమవుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గత బడ్జెట్‌లో BRS ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ నుంచి రూ.19,884 కోట్ల ఆదాయాన్ని ఆశించగా.. కాంగ్రెస్ సర్కార్ రూ.25,617 కోట్ల రాబడిని టార్గెట్‌గా పెట్టుకుందన్నారు. బీర్లపై రూ.3,500 కోట్లు, మద్యంపై రూ.15,500 కోట్లకు డ్యూటీని పెంచిందని వెల్లడించారు.

Similar News

News October 27, 2025

మహిళా క్రికెటర్లపై దాడి.. మంత్రి వ్యాఖ్యలతో దుమారం

image

AUS మహిళా క్రికెటర్లను ఓ వ్యక్తి <<18103257>>అసభ్యంగా<<>> తాకిన ఘటనపై MPకి చెందిన మంత్రి విజయ్‌వర్గీయా కామెంట్స్ దుమారం రేపాయి. ‘ఈ ఘటన ప్లేయర్లకు గుణపాఠం లాంటిది. ENGలో ఓ ఫేమస్ ఫుట్‌బాల్ ప్లేయర్‌కు అమ్మాయి కిస్ ఇవ్వడం, అతడి దుస్తులు చింపేయడం వంటివి చూశాను. ప్లేయర్లు తమ పాపులారిటీని తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. ఆయనపై విపక్షాలు, ఉమెన్ రైట్స్ గ్రూప్స్ భగ్గుమన్నాయి.

News October 27, 2025

అధిక వర్షాలు.. కంది పంటలో నివారణ చర్యలు

image

కంది పంటలోని నీటిని తొలగించాలి. 19:19:19 లేదా పొటాషియం నైట్రేట్ 1% పిచికారీ చేయాలి. ఎండు తెగులు కనిపిస్తే కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లలో పిచికారీ చేయాలి. పూత దశలో శనగ పచ్చ/మారుకా మచ్చల పురుగు కనిపిస్తే క్లోరిపైరిఫాస్ 20EC 2.5మి.లీ లేదా నొవాల్యురాన్ 10EC 10మి.లీ లీటరు నీటికి, పురుగు ఎక్కువగా ఉంటే స్పైనోసాడ్ 45SC 0.3మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

News October 27, 2025

అధిక వర్షాలు.. పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు (1/2)

image

AP: భారీ వర్షాలకు పత్తి చేను ముంపునకు గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర వ్యవసాయశాఖ కొన్ని సూచనలు చేసింది. ముందుగా పత్తిచేలో వర్షపు నీటిని తొలగించాలి. చాలా చోట్ల పత్తి పూత, కాయ దశలో ఉంది. పైపాటుగా యూరియా ఎకరానికి 30kgలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 15kgలు భూమిలో వేయాలి. 2% యూరియా లేదా 2% పొటాషియం నైట్రేట్‌ను 1శాతం మెగ్నీషియం సల్ఫేట్‌తో కలిపి 5 నుంచి 7 రోజుల వ్యవధిలో 2సార్లు పిచికారీ చేయాలి.