News September 23, 2024
ప్రభుత్వం పిరికిపంద చర్యలు ఆపాలి: BRS
TG: డాక్టర్లతో తాము ఏర్పాటు చేసిన బృందం ఆసుపత్రులను సందర్శిస్తుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని BRS ప్రశ్నించింది. వైద్యారోగ్య సేవల తీరుపై అధ్యయనం చేసే డాక్టర్ల బృందాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారని పేర్కొంది. డా.తాటికొండ రాజయ్య, డా.కల్వకుంట్ల సంజయ్, డా.మెతుకు ఆనంద్ ఇళ్ల వద్దకు చేరిన పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంది. ప్రభుత్వం ఇలాంటి పిరికిపంద చర్యలు మానుకోవాలని హితవు పలికింది.
Similar News
News September 23, 2024
కొత్త పెన్షన్లపై BIG UPDATE
AP: కొత్త పెన్షన్లను అక్టోబర్ నుంచి అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో తొలగించిన లక్షల మంది లబ్ధిదారుల వివరాలను సేకరిస్తోంది. గ్రామ సభలు నిర్వహించి ఆరు అంచెల తనిఖీల తర్వాత వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల్లో అర్హులు, అనర్హులను గుర్తించనున్నారు. సచివాలయాల్లో జాబితాను ప్రదర్శించి, అనర్హుల నుంచి వివరణ తీసుకుంటారు. క్యాబినెట్ సబ్ కమిటీ దీనిపై త్వరలో విధివిధానాలు ప్రకటించే ఛాన్సుంది.
News September 23, 2024
అదే జరిగితే పోటీ చేయను: ట్రంప్
ఈ ఎలక్షన్స్లో గెలవకుంటే 2028లో మళ్లీ పోటీ చేయనని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కొవిడ్ టైమ్లో తన పాలన బాగుందన్నారు. సాధారణంగా ఓటమిని అంగీకరించని ఆయన ఇలా మాట్లాడటం ఇంట్రెస్టింగ్గా మారింది. 2020లో మాదిరిగా భారీ స్థాయిలో మోసగిస్తే, తప్పుడు ఆరోపణలు చేస్తేనే అలా జరుగుతుందని ట్రంప్ చెప్పే సంగతి తెలిసిందే. 2028 నాటికి ఆయనకు 82ఏళ్లు వస్తాయి.
News September 23, 2024
‘దేవర’ ఈవెంట్ను అందుకే రద్దు చేశాం: శ్రేయాస్ మీడియా
‘దేవర’ ఈవెంట్ రద్దుపై శ్రేయాస్ మీడియా ప్రెస్నోట్ రిలీజ్ చేసింది. ‘పోలీసులు 4వేల మంది హాజరయ్యేందుకు పర్మిషన్ ఇచ్చారు. కానీ 30-35 వేల మంది రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఫ్యాన్స్ సేఫ్టీ కోసమే ఈవెంట్ రద్దు చేశాం. మమ్మల్ని క్షమించండి. అవుట్ డోర్ ఈవెంట్ కోసం ప్రయత్నించాం. కానీ గణేశ్ నిమజ్జనం, వెదర్ అలర్ట్స్ వల్ల సాధ్యం కాలేదు. పరిమితికి మించి పాసులు జారీ చేశామన్న ఆరోపణలు అవాస్తవం’ అని పేర్కొంది.