News June 12, 2024
టెట్ అర్హత సాధించని వారికి ప్రభుత్వం ఉపశమనం

TG: టెట్ అర్హత సాధించని వారికి ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. అర్హులు కాని అభ్యర్థులు వచ్చే టెట్కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చింది. అర్హత సాధించిన వారు డీఎస్సీకి ఉచితంగా అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. ఎన్నికల కోడ్ వల్ల టెట్-2024 దరఖాస్తు ఫీజును ప్రభుత్వం తగ్గించలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇవాళ టెట్ <<13426430>>ఫలితాలు<<>> వెలువడిన సంగతి తెలిసిందే.
Similar News
News March 27, 2026
ధరలను నియంత్రించేందుకే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాం: కేంద్రం

ధరల పెరుగుదల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు పెట్రోల్, డీజిల్పై <<19487934>>ఎక్సైజ్ డ్యూటీ<<>> తగ్గించామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే డీజిల్ ఎగుమతులపై లీటర్కు 21.5, జెట్ ఫ్యూయల్ ఎగుమతులపై లీటర్కు 29.5 చొప్పున సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల చమురు కంపెనీలు తమ ఉత్పత్తిని అంతర్జాతీయ మార్కెట్కు అమ్ముకోకుండా దేశీయ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తాయని పేర్కొన్నారు.
News March 27, 2026
ధరలను నియంత్రించేందుకే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాం: కేంద్రం

ధరల పెరుగుదల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు పెట్రోల్, డీజిల్పై <<19487934>>ఎక్సైజ్ డ్యూటీ<<>> తగ్గించామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే డీజిల్ ఎగుమతులపై లీటర్కు 21.5, జెట్ ఫ్యూయల్ ఎగుమతులపై లీటర్కు 29.5 చొప్పున సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల చమురు కంపెనీలు తమ ఉత్పత్తిని అంతర్జాతీయ మార్కెట్కు అమ్ముకోకుండా దేశీయ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తాయని పేర్కొన్నారు.
News March 27, 2026
దేశంలో లాక్డౌన్ వార్తలు.. కేంద్రం ఏమందంటే?

దేశంలో ఇంధన కొరత నేపథ్యంలో లాక్డౌన్ తప్పదన్న ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖండించారు. అది పూర్తిగా అసత్య ప్రచారం అని ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర అలాంటి ప్రతిపాదనేమీ లేదని స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐకమత్యంగా ఉండటం ఎంతో ముఖ్యమన్నారు. సంక్షోభాలను ఎదుర్కొనేందుకు తాము పూర్తిగా సన్నద్ధమై ఉన్నామని పేర్కొన్నారు.


